Webdunia - Bharat's app for daily news and videos

Install App

జర్నలిస్టులంతటి నీతిలేని వాళ్లు ఈ భూమ్మీదే లేరు : డోనాల్డ్ ట్రంప్

అమెరికా జర్నలిస్టులపై ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఈ జర్నలిస్టులంతటి నీతిలేని వాళ్లు ఈ భూమ్మీదే లేరని మండిపడ్డారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రజలు పెద్దగా రాలేదని కొన్ని పత్రిక

Webdunia
సోమవారం, 23 జనవరి 2017 (09:22 IST)
అమెరికా జర్నలిస్టులపై ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఈ జర్నలిస్టులంతటి నీతిలేని వాళ్లు ఈ భూమ్మీదే లేరని మండిపడ్డారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రజలు పెద్దగా రాలేదని కొన్ని పత్రికలు ఖాళీ జాగా ఫొటోలు ప్రచురించడమే ఆయన ఆగ్రహానికి కారణం. మీడియాతో తాను యుద్ధం చేస్తున్నానని, తన ప్రమాణ స్వీకారానికి జనం పెద్దసంఖ్యలో హాజరు కాలేదని రాసినందుకు మీడియా ఫలితం అనుభవిస్తుందని హెచ్చరించారు. 
 
సీఐఏ హెడ్‌క్వార్టర్స్‌లో నిఘా అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘నా సభకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. వాషింగ్టన్‌ మాన్యుమెంట్‌కు దారితీసే రోడ్డంతా కిక్కిరిసిపోయింది. పొద్దునే లేచి కొన్ని నెట్‌వర్క్‌లు చూశాను. మైదానంలో ఖాళీగా ఉన్న ప్రాంతమంటూ జనం లేనిచోట ఫొటోలు తీసి ప్రచురించారు. కానీ పది, పదిహేను లక్షల మంది వచ్చారు. ఓ మీడియా సంస్థ రెండున్నర లక్షల మందే వచ్చారని రాసింది. ఇది పచ్చి అబద్ధం. వేదిక వద్ద ఒకవైపు రెండున్నర లక్షలున్న మాట నిజం. కానీ వాషింగ్టన్‌ మాన్యుమెంట్‌ వరకు 20 బ్లాకుల మేర ఇసుకేస్తే రాలనంతగా జనం వచ్చారు. అబద్ధాలు రాసినందుకు వారు మూల్యం చెల్లించుకుంటారు’ అంటూ హెచ్చరించారు. 
 
అంతేకాకుండా, నిఘా వ్యవస్థతో తనకు అభిప్రాయ భేదాలు వచ్చినట్లు మీడియా రాసిందని, అందుకే తొలుత సీఐఏ ప్రధాన కార్యాలయానికి వచ్చానని చెప్పారు. ‘మీడియాతో నేను పోరాటం చేస్తున్నానని మీకు తెలుసు. ఈ భూమ్మీద నీతినిజాయితీ లేనివారిలో మీడియా కూడా ఉంది’ అని ఆయన అనగానే సీఐఏ అధికారులు బిగ్గరగా నవ్వారు. కాగా.. ఐఎస్‌ ఉగ్రవాద సంస్థను, ఇస్లామిక్‌ ఉగ్రవాదాన్ని తుదముట్టించడం తప్ప అమెరికాకు వేరే మార్గం లేదని ట్రంప్‌ వారితో అన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నవీన్ చంద్ర తన భార్యను టార్చెర్ పెడుతున్నాడంటూ కాలనీవాసుల ఫిర్యాదు !

Kesari2 : అక్షయ్ కుమార్ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Ritu Varma: వైష్ణవ్ తేజ్‌తో ప్రేమాయణం.. ఖండించిన రీతు వర్మ.. కెరీర్‌పై ఫోకస్

Kingdom: జూలై 4న విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' చిత్రం విడుదల

Pitapuram: లోక కళ్యాణం కోసం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంబాయాగం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments