Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుందర్ పిచాయ్‌కి పద్మభూషణ్.. భారత్ నా శరీరంలో అంతర్భాగం

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2022 (14:01 IST)
Sundar pichai
భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్‌కు ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ అవార్డు లభించింది. ఈ మేరకు అమెరికాలోని భారత రాయబారి నుంచి సుందర్ పిచాయ్ శుక్రవారం ఈ పురస్కారం అందుకున్నారు. 
 
2022 ఏడాదికి గానూ సుందర్ పిచాయ్‌కి పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించగా, అమెరికాలోని భారత రాయబారి నుంచి సుందర్ పిచాయ్ శుక్రవారం ఈ పురస్కారం అందుకున్నారు. 
 
ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. భారతదేశం తన శరీరంలో అంతర్భాగమన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తన వెంట భారతదేశాన్ని తీసుకెళ్తానని చెప్పారు. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. 
 
ఈ సందర్భంగా భారత సర్కారుకు, దేశ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేగాకుండా తన తల్లిదండ్రులకు, తన ఎదుగుదలకు సాయపడిన వారిని గుర్తు చేసుకున్నారు.  
 
కాగా మదురై నుండి మౌంటెన్ వ్యూ వరకు సుందర్ పిచాయ్ స్ఫూర్తిదాయకమైన ప్రయాణం, భారతదేశం-అమెరికా ఆర్థిక- సాంకేతికతను బలోపేతం చేసిందని.. విదేశాంగ శాఖ అధికారి తరంజిత్ ఎస్ సంధు అన్నారు. సుందర్ పిచాయ్‌కు పద్మభూషణ్ అవార్డు ఇవ్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments