Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ నెత్తిన చైనా రాకెట్ "లాంగ్ మార్చ్ 5బి".. విధ్వంసమేనా??

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (08:33 IST)
నింగిలో అదుపు తప్పి భూమిపైకి దూసుకొస్తున్న చైనా రాకెట్... ఇపుడు ఢిల్లీ నెత్తినపడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చైనా రాకెట్ పేరు లాంగ్ మార్చ్ 5బి. దీనిపైనే ప్రస్తుతం యావత్ ప్రపంచం దృష్టి కేంద్రీకృతమైవుంది. ఇది మరో 48 గంటల్లో (మే 8 నాటికి) భూమిని తాకొచ్చని అమెరికా రక్షణ శాఖ ప్రకటించారు. అయితే, ఈ రాకెట్ ఏ దేశంలో పడుతుందనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. 
 
ఈ నేపథ్యంలో అమెరికాలోని హార్వర్డ్‌ స్మితోజియన్‌ ఆస్ట్రోఫిజికల్‌ అబ్జర్వేటరీ ఖగోళ శాస్త్రజ్ఞుడు జొనాథన్‌ మెక్‌డోవెల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా రాకెట్‌.. భారత రాజధాని ఢిల్లీపైనా పడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. బీజింగ్‌, ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం, బ్రెజిల్‌లోని రియో డీ జెనీరియో నగరాలపై పడే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమని చెప్పుకొచ్చారు. 
 
ప్రస్తుతం ఆ రాకెట్‌ సెకనుకు 4 మైళ్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తోందని, భూమధ్యరేఖకు ఉత్తర, దక్షిణ భాగాలలో 41 డిగ్రీల మధ్య ఉండే ప్రాంతాల్లో ఎక్కడైనా లాంగ్‌ మార్చ్‌ 5బీ కుప్పకూలొచ్చన్నారు. అయితే దాన్ని అదుపులోకి తీసుకొని, నిర్జన ప్రదేశాల వైపు మళ్లించే ప్రయత్నాల్లో చైనా నిమగ్నమైవుండొచ్చని చెప్పుకొచ్చారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments