Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ వైరస్ మహమ్మారికి 1.80 లక్షల మంది హెల్త్ వర్కర్ల మృతి

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (12:32 IST)
ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మహమ్మారి హెల్త్ వర్కర్లపై తీవ్ర ప్రభావం చూపించింది. ఈ మహమ్మారి దెబ్బకు ఏకంగా 1.80 లక్షల మంది హెల్త్ వర్కర్లు ప్రాణాలు కోల్పోయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది. 
 
ఆరోగ్య‌కార్య‌క‌ర్త‌ల‌కు తొలుత కోవిడ్ టీకాల‌ను ఇవ్వాల‌ని డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథ‌న‌మ్ గెబ్రియాసిస్ తెలిపారు. కోవిడ్ టీకాల పంపిణీలో జ‌రుగుతున్న అస‌మాన‌త‌ల‌ను ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. 
 
గ‌త ఏడాది జ‌న‌వ‌రి నుంచి ఈ ఏడాది మే వ‌ర‌కు కోవిడ్‌పై పోరాటంలో హెల్త్‌వ‌ర్క‌ర్లు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఆయ‌న తెలిపారు. కోవిడ్ టీకాల జాప్యం వ‌ల్ల క‌రోనా వ‌చ్చే ఏడాది కూడా ప్ర‌భావం చూపే అవ‌కాశాలు ఉన్న‌ట్లు మ‌రో డ‌బ్ల్యూహెచ్‌వో అధికారి తెలిపారు.
 
ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుమారు 135 మిలియ‌న్ల మంది హెల్త్ వ‌ర్క‌ర్లు ఉన్నారు. అయితే 119 దేశాల‌కు చెందిన డేటా ప్ర‌కారం.. ప్ర‌తి అయిదుగురిలో ఇద్ద‌రు మాత్ర‌మే పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్న‌ట్లు టెడ్రోస్ తెలిపారు. 
 
ఆఫ్రికాలో ప‌ది మందిలో, ఒక హెల్త్‌వ‌ర్క‌ర్ మాత్ర‌మే వ్యాక్సినేట్ అయిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ఇక సంప‌న్న దేశాల్లో ప‌ది మందిలో.. 8 మంది టీకాలు వేయించుకున్న‌ట్లు టెడ్రోస్ తెలిపారు. ఆఫ్రికాలో కేవ‌లం 5 శాతం జ‌నాభా మాత్ర‌మే వ్యాక్సిన్ వేసుకున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments