Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ వైరస్ మహమ్మారికి 1.80 లక్షల మంది హెల్త్ వర్కర్ల మృతి

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (12:32 IST)
ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మహమ్మారి హెల్త్ వర్కర్లపై తీవ్ర ప్రభావం చూపించింది. ఈ మహమ్మారి దెబ్బకు ఏకంగా 1.80 లక్షల మంది హెల్త్ వర్కర్లు ప్రాణాలు కోల్పోయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది. 
 
ఆరోగ్య‌కార్య‌క‌ర్త‌ల‌కు తొలుత కోవిడ్ టీకాల‌ను ఇవ్వాల‌ని డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథ‌న‌మ్ గెబ్రియాసిస్ తెలిపారు. కోవిడ్ టీకాల పంపిణీలో జ‌రుగుతున్న అస‌మాన‌త‌ల‌ను ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. 
 
గ‌త ఏడాది జ‌న‌వ‌రి నుంచి ఈ ఏడాది మే వ‌ర‌కు కోవిడ్‌పై పోరాటంలో హెల్త్‌వ‌ర్క‌ర్లు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఆయ‌న తెలిపారు. కోవిడ్ టీకాల జాప్యం వ‌ల్ల క‌రోనా వ‌చ్చే ఏడాది కూడా ప్ర‌భావం చూపే అవ‌కాశాలు ఉన్న‌ట్లు మ‌రో డ‌బ్ల్యూహెచ్‌వో అధికారి తెలిపారు.
 
ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుమారు 135 మిలియ‌న్ల మంది హెల్త్ వ‌ర్క‌ర్లు ఉన్నారు. అయితే 119 దేశాల‌కు చెందిన డేటా ప్ర‌కారం.. ప్ర‌తి అయిదుగురిలో ఇద్ద‌రు మాత్ర‌మే పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్న‌ట్లు టెడ్రోస్ తెలిపారు. 
 
ఆఫ్రికాలో ప‌ది మందిలో, ఒక హెల్త్‌వ‌ర్క‌ర్ మాత్ర‌మే వ్యాక్సినేట్ అయిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ఇక సంప‌న్న దేశాల్లో ప‌ది మందిలో.. 8 మంది టీకాలు వేయించుకున్న‌ట్లు టెడ్రోస్ తెలిపారు. ఆఫ్రికాలో కేవ‌లం 5 శాతం జ‌నాభా మాత్ర‌మే వ్యాక్సిన్ వేసుకున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

రెండు పార్టులుగా ఫేస్తోన్న మిరాయ్ తో మళ్ళీ వెండితెరపైకి మనోజ్ మంచు

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments