Webdunia - Bharat's app for daily news and videos

Install App

మక్కా మసీదు మూసివేతకు నిర్ణయం?

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (08:59 IST)
సౌదీ అరేబియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లిం సౌదరులు తమ జీవితకాలంలో ఒక్కసారైనా వెళ్లివచ్చే పవిత్ర మక్కా మసీదును మూసివేయనున్నారు. అదీ కూడా పవిత్ర మాసంగా భావించే రంజాన్ నెలలోనే ఈ మసీదును మూసివేయనున్నారు. ఈ నిర్ణయంతో పవిత్ర మక్కాలోని అల్ హరం, అల్ నబవీ మసీదులను మూతపడనున్నాయి. 
 
ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ కబళించింది. ఈ వైరస్ బారినపడిన దేశాల్లో సౌదీ అరేబియా కూడా ఉంది. ఈ దేశంలో కూడా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్‌డౌన్ కూడా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంజాన్ మాసంలో మసీదులు తెరిచివుంచితే కరోనా మహమ్మారి మరింతగా వ్యాపించే అవకాశం ఉందని భావించిన సౌదీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. 
 
వాస్తవానికి రంజాన్ మాసంలో ఉపవాసాల సందర్భంగా ప్రపంచదేశాల నుంచి లక్షలాది మంది మక్కాకు, హజ్ యాత్రకూ వచ్చి, ఇక్కడి మసీదుల్లో ప్రార్థనలు చేస్తుంటారు. ఈ సంవత్సరం ఎటువంటి ప్రార్థనలకూ అనుమతి ఇవ్వబోమని మసీదుల ప్రెసిడెంట్ డాక్టర్ షేఖ్ అబ్దుల్ రహమాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌదీస్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
 
తరావీ నమాజ్‌లను, రంజాన్ ఈద్ నమాజ్‌ను ముస్లింలంతా ఇళ్లలోనే చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కాగా, ఇప్పటివరకూ సుమారు 10 వేల మందికి పైగా సౌదీ అరేబియాలో కరోనా బారిన పడగా, వారిలో 100 మందికి పైగా మరణించారు. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments