Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ త్వరలోనే సీజనల్ వ్యాధిగా మారనుంది.. ఐరాస

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (15:18 IST)
corona
చైనాలోని వుహన్ నగరంలో తొలుత బయటపడిన కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఇప్పుడు మళ్లీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 11.95కోట్లు దాటింది. మరణాల సంఖ్య 26.50లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2.06కోట్లకు పైగా ఉన్నాయి. 
 
వ్యాక్సిన్ వచ్చినప్పటికి కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకరమైన విషయం. కొత్త రూపాల్లో కోవిడ్ విజృంభిస్తోంది. కరోనా పీడ ఎప్పుడు విరగడ అవుతుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఐక్యరాజ్య సమితి మరో బాంబు పేల్చింది.
 
కరోనా వైరస్ త్వరలోనే సీజనల్ వ్యాధిగా మారనున్నదని ప్రకటించింది. కరోనా వ్యాప్తిపై వాతావరణ మార్పులు, గాలి నాణ్యత ప్రభావాలపై ఐరాస నిపుణుల బృందం అధ్యయనం చేసింది. దాని ఆధారంగానే ఐరాస ఈ హెచ్చరిక జారీ చేసింది. వాతావరణ అంశాల ఆధారంగా కరోనా నిబంధనలకు సడలింపులు ఇవ్వొద్దని ప్రపంచదేశాలకు సూచించింది. శ్వాసకోశ వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు తరచూ సీజనల్‌గా మారతాయని ఈ నిపుణుల బృందం వెల్లడించింది.
 
శీతాకాలంలో ఇన్‌ఫ్లూయెంజా విజృంభణ ఉంటుందని, సమశీతోష్ణ వాతావరణ పరిస్థితుల్లో జలుబు కరోనా వైరస్‌ వ్యాప్తి ఉంటుందని వెల్లడించింది. ఈ తీరు కొన్ని సంవత్సరాల పాటు కొనసాగితే, కొవిడ్‌-19 సీజనల్‌ వ్యాధిగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments