Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో కరోనా వైరస్ విజృంభణ : అష్టదిగ్భంధనంలో నగరాలు (video)

Webdunia
శనివారం, 25 జనవరి 2020 (10:58 IST)
చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ వైరస్ బారినపడిన చనిపోయిన రోగుల సంఖ్య 26కు చేరింది. మరో 41 మిలియన్ల మందికి ఈ వైరస్ సోకినట్టు చైనా ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. అత్యంత ప్రమాదకారిగా మారిన ఈ వైరస్ బారిన మరికొంతమంది ప్రజలు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులోభాగంగా అష్టదిగ్బంధనం చేసింది. ఈ అష్టదిగ్బంధనంలోకి 13 నగరాలు వచ్చాయి. అంటే, ఆయా నగరాల్లోని ప్రజా రవాణా వ్యవస్థను మొత్తం నిలిపివేసింది. దీంతో నాలుగు కోట్ల మంది ప్రజలు ఎటూ కదల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
మరోవైపు, కరోనా వైరస్ కోరలు చాస్తుండడంతో దేశంలో ఎక్కడా కొత్త సంవత్సర వేడుకల జాడ కనిపించలేదు. చైనా కొత్త సంవత్సరమైన మూషిక ఏడాది శనివారం నుంచే ప్రారంభమైంది. చైనాలో ఇది అతిపెద్ద పండుగ అయినప్పటికీ ఎక్కడా సందడి లేదు. వ్యాధి మరింత విస్తరించకుండా చేపట్టే చర్యల కోసం ప్రభుత్వం వంద కోట్ల యువాన్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1008 కోట్లు కేటాయించింది. కరోనా వైరస్ బాధితులకు చికిత్స కోసం సైన్యంలోని వైద్యాధికారుల్ని రంగంలోకి దించారు. ఇక, చైనాలోని భారత రాయబార కార్యాలయంలో ఆదివారం జరగాల్సిన భారత రిపబ్లిక్ డే వేడుకలను రద్దు చేశారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments