Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఇమేజ్‌ను ఫోటో తీసిన శాస్త్రవేత్తలు.. అమెరికాలో ఘోరం

Webdunia
శనివారం, 28 మార్చి 2020 (10:53 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఇమేజ్‌ను పూణేలోని శాస్త్రవేత్తలు ఫోటో తీశారు. ట్రాన్స్‌మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఇమేజింగ్‌ను ఉపయోగించి కరోనా వైరస్‌ను ఫొటో తీశారు శాస్త్రవేత్తలు. ఈ చిత్రం ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురితమైంది. ఈ ఏడాది జనవరి 30న దేశంలో తొలి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో చైనాలోని వూహాన్‌ నుంచి భారత్‌కు వచ్చిన కేరళకు చెందిన ముగ్గురు మెడిసిన్ విద్యార్థుల్లో కరోనా లక్షణాలు కనిపించాయి. 
 
భారత్‌లో నమోదైన తొలి మూడు కేసులు ఇవే. వీరి నమూనాలను పూణెలోని ప్రయోగశాలకు పంపారు. ఆ నమూనాల నుంచి కోవిడ్-19కు కారణమైన వైరస్‌ను గుర్తించి ఫొటో తీశారు. ఈ వైరస్ చూడడానికి కిరీటంలా కనిపిస్తుండడంతో దీనికి కరోనా అనే పేరు వచ్చింది. కరోనా అంటే లాటిన్ భాషలో కిరీటం అని అర్థమని శాస్త్రవేత్తలు తెలిపారు. 
 
ఇదిలా ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మరింత విస్తరిస్తోంది. ముఖ్యంగా అగ్ర రాజ్యమైన అమెరికాలో కరోనా కేసులు పెరగడమే కాదు మరణాల సంఖ్య కూడా చైనాను దాటవేస్తుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన దేశంగా రికార్డులకెక్కిన అమెరికా.. పాజిటివ్ కేసులో విషయంలో మరింతగా దూసుకుపోతోంది. గురువారం ఒక్కరోజే అక్కడ 16,877 కేసులు నమోదుకావడాన్ని బట్టే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments