Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా భయం లేకుంటే భారత్‌ను పాకిస్థాన్ నాశనం చేసేది!

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2015 (10:23 IST)
అమెరికా అనే భయం లేకుండా ఉండివుంటే భారత్‌ను పాకిస్థాన్ ఎపుడో నాశనం చేసివుండేదని అమెరికాకు చెందిన నిఘా సంస్థ సీఐఏ నివేదికలోని పత్రాలు వెల్లడిస్తున్నాయి. భారత్‌పై దాడులు కొనసాగిస్తే పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశాల జాబితాలో ఉంచుతామని, తామిచ్చే నిధులను నిలిపివేస్తామని అమెరికా గతంలో హెచ్చరికలు చేసింది. దీంతో భారత్‌పై దాడి చేసే సాహసం పాకిస్థాన్ చేయడం లేదని ఈ పత్రాలు వెల్లడిస్తున్నాయి. 
 
వాస్తవానికి భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న విషయంతెల్సిందే. ముఖ్యంగా భారత్‌పై దాడులు చేసే ఉగ్రవాద సంస్థలకు తమ గడ్డపై ఆశ్రయం కల్పిస్తూ నిధులు సమకూర్చుతోంది. గతంలో జరిగిన అనేక దాడుల్లోనూ పాకిస్థాన్ హస్తం ఉన్నట్టు తేలింది కూడా. ఈ నిధులను పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అందజేస్తోంది. వీటికి సంబంధించిన పక్కా ఆధారాలను అమెరికా సంపాదించింది. 
 
అయితే, పాకిస్థాన్ తన వైఖరిని మార్చుకోని పక్షంలో ఉగ్ర దేశాల జాబితాలో చేరుస్తామని యూఎస్ హెచ్చరించింది. దీంతో పాక్ కాస్తంత వెనకడుగు వేసింది. భారత్ నుంచి వెళ్లే విమానాలపైనా దాడులు చేసేందుకు పాక్ కుట్ర చేసినట్టు సీఐఏ పత్రాలు తెలియజేస్తున్నాయి. అమెరికా నుంచి వచ్చే నిధులు ఆగుతాయన్న భయాలే లేకుంటే, పాక్ ఏనాడో పెను విధ్వంసానికి కారణమై ఉండేదని సీఐఏ పత్రాలు వెల్లడిస్తున్నాయి.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments