జో బైడెన్‌కు జిన్‌పింగ్ వార్నింగ్.. నిప్పుతో ఆడుకుంటే కాలిపోతారు..

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (21:20 IST)
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చైనా అధినేత వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది. తైవాన్‌కు అమెరికా మద్దతు ఇవ్వడం అంటే నిప్పు వెలిగించడం వంటిదేనని జీ జిన్‌పింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారని డ్రాగన్ అధికారిక మీడియా వెల్లడించింది.

జో బైడెన్, జీ జిన్‌పింగ్ మధ్య సోమవారం వర్చువల్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో తైవాన్ సహా పలు అంశాలు చర్చకు వచ్చిన సందర్భంగా జిన్‌పింగ్ హెచ్చరించినట్టు చైనా మీడియా పేర్కొంది. తైవాన్ తమ భూభాగమే అని చైనా వాదిస్తోంది.
 
బైడెన్‌తో భేటీలో ప్రధానంగా ఇదే సమస్యను లేవనెత్తినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ‘తైవాన్ అధికారులు స్వాతంత్ర్యం కోసం యుఎస్‌పై ఆధారపడటానికి పదేపదే ప్రయత్నించారు’ అని జిన్‌పింగ్ వ్యాఖ్యలను చైనా అధికారిక మీడియా ఏజెన్సీ జిన్హువా ఉటంకిస్తూ.. ‘‘యుఎస్‌లోని కొంతమంది వ్యక్తులు చైనాను నియంత్రించడానికి తైవాన్‌ను ఉపయోగించాలని భావిస్తున్నారు.. ఈ ధోరణి చాలా ప్రమాదకరమైనది.. నిప్పుతో చెలగాటమాడుకోవడం లాంటిది.. నిప్పుతో ఆడుకుంటే కాలిపోతారు’’ అని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments