Webdunia - Bharat's app for daily news and videos

Install App

జో బైడెన్‌కు జిన్‌పింగ్ వార్నింగ్.. నిప్పుతో ఆడుకుంటే కాలిపోతారు..

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (21:20 IST)
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చైనా అధినేత వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది. తైవాన్‌కు అమెరికా మద్దతు ఇవ్వడం అంటే నిప్పు వెలిగించడం వంటిదేనని జీ జిన్‌పింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారని డ్రాగన్ అధికారిక మీడియా వెల్లడించింది.

జో బైడెన్, జీ జిన్‌పింగ్ మధ్య సోమవారం వర్చువల్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో తైవాన్ సహా పలు అంశాలు చర్చకు వచ్చిన సందర్భంగా జిన్‌పింగ్ హెచ్చరించినట్టు చైనా మీడియా పేర్కొంది. తైవాన్ తమ భూభాగమే అని చైనా వాదిస్తోంది.
 
బైడెన్‌తో భేటీలో ప్రధానంగా ఇదే సమస్యను లేవనెత్తినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ‘తైవాన్ అధికారులు స్వాతంత్ర్యం కోసం యుఎస్‌పై ఆధారపడటానికి పదేపదే ప్రయత్నించారు’ అని జిన్‌పింగ్ వ్యాఖ్యలను చైనా అధికారిక మీడియా ఏజెన్సీ జిన్హువా ఉటంకిస్తూ.. ‘‘యుఎస్‌లోని కొంతమంది వ్యక్తులు చైనాను నియంత్రించడానికి తైవాన్‌ను ఉపయోగించాలని భావిస్తున్నారు.. ఈ ధోరణి చాలా ప్రమాదకరమైనది.. నిప్పుతో చెలగాటమాడుకోవడం లాంటిది.. నిప్పుతో ఆడుకుంటే కాలిపోతారు’’ అని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

మంగ్లీ డ్రగ్ పార్టీలో మేం లేవంటున్న రచ్చ రవి, దివి వాద్య, కాసర్ల శ్యామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments