Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో కరోనా మృతులు.. 40 వేలకు పైమాటే.. వుహాన్ ప్రజలు

Webdunia
సోమవారం, 30 మార్చి 2020 (12:29 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పురుడు పోసుకున్న నగరం వుహాన్. చైనాలో ఉంది. ఈ వైరస్ దెబ్బకు తొలుత వణికిపోయిన దేశ చైనానే. ముఖ్యంగా, వుహాన్, హుబేయ్ ప్రానిన్స్‌లను వణికించిన ఈ వైరస్.. ఇపుడు ప్రపంచాన్ని కబళించింది. ఇప్పటికే 7 లక్షల మందికి ఈ వైరస్ సోకింది. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 23 వేల మంది ప్రాణాలను తీసింది. 
 
అయితే, ఈ వైరస్ పురుడు పోసుకున్న చైనా నగరంలో మృతుల సంఖ్య 3,300 అని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించగా, ఇక్కడి మరణాల సంఖ్య 42 వేలకు పైనేనని వూహాన్ ప్రజలు అంటున్నారు. దీనికి సాక్ష్యాధారాలను కూడా వారు చూపుతున్నారు. ఎందుకంటే... గత నెల రోజుల వ్యవధిలో 28 వేల మృతదేహాలను దహనం చేశారని, మృతుల లెక్కపై సమగ్ర దర్యాప్తే లేదని, లెక్కకు మించి జనం వారి ఇళ్లలోనే మరణించారని అంటున్నారు. 
 
ముఖ్యంగా, చైనా ప్రభుత్వ అధికారులు వెల్లడించిన గణాంకాలతో పోలిస్తే, మృతుల సంఖ్య 10 రెట్లు ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ప్రతిరోజూ 500 ఆస్తి కలశాలను మృతుల బంధువులకు అందిస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. వచ్చే 12 రోజుల్లో అస్తికలు కలశాల పంపిణీ పూర్తవతుందని, అందరు మృతుల అస్తులనూ వారి బంధువులకు పంచుతామని అధికారులు అంటున్నారని ఇక్కడి ప్రజలు వెల్లడించారు. కాగా, మొదటి నుంచి చైనాలో సంభవించిన మరణాల సంఖ్యపై సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments