Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలక్ట్రానిక్ టాయి‌లెట్‌ను దొంగిలించిన చైనా దంపతులు... ఎలా చిక్కారు?

చైనాకు చెందిన ఓ దంపతులు చేసిన పని అందరిముందు వారిని నవ్వులపాలు చేసింది. ఈ జంట ఇటీవల సరదా కోసం జపాన్ వెళ్లారు. అక్కడ ఒక హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. అయితే ఈ జంట ఆ గదిలో ఏం చేశారో తెలిస్తే ముక్క

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (14:46 IST)
చైనాకు చెందిన ఓ దంపతులు చేసిన పని అందరిముందు వారిని నవ్వులపాలు చేసింది. ఈ జంట ఇటీవల సరదా కోసం జపాన్ వెళ్లారు. అక్కడ ఒక హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. అయితే ఈ జంట ఆ గదిలో ఏం చేశారో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... చైనాకు చెందిన లీ, అతని భార్య చెన్ ఇటీవల జపాన్‌లోని నగోయ వెళ్లి అక్కడి స్టార్ హోటల్‌లో బస చేశారు. వారు చైనాకు తిరిగోస్తుండగా వారి గదిలోని ఎలక్ట్రానిక్ టాయిలెట్ సీటును దొంగతనంగా ఎత్తుకొచ్చారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఈ విషయాన్ని హోటల్ సిబ్బంది గమనించాడు. వారిని గట్టిగా నిలదీశాడు. విషయం కాస్తా బయటపడి తమ పరువు కాస్తా బజారుకెక్కడంతో చైనాకు తిరిగొచ్చిన జంట తిరిగి ఆ టాయిలెట్ సీటును నగోయా హోటల్‌‌కు పార్సిల్ చేసింది. 
 
దొంగతనం చేసినందుకు క్షమాపణలు చెప్పారు. చైనాలో ఎలక్ట్రానిక్ టాయిలెట్ సీట్లకు విపరీతమైన డిమాండ్ ఉండడం, అయినా అవి దొరకకపోతుండడంతో జపాన్ వచ్చే చైనీయులు వాటిని కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. అయితే ఈ జంట మాత్రం కాస్త డిఫరెంటుగా ఆలోచించి బస చేసిన హోటల్‌లోని టాయిలెట్ సీటును ఎత్తుకొచ్చేసింది. నలుగురికి ఈ విషయం తెలియడంతో సిగ్గుతో తల వంచుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments