Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసూద్‌పై మరోసారి పంతం నెగ్గించుకున్న చైనా

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (12:38 IST)
చైనా మరోసారి తన అసలు రంగును బయట పెట్టుకుంది. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మరోసారి అడ్డుపుల్ల వేసింది. భద్రతా మండలిలో చైనా తనకున్న వీటో అధికారంతో మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే ప్రతిపాదనను నాలుగోసారి చైనా తిరస్కరించింది.
 
మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భద్రతా మండలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు తీర్మానాన్నిప్రవేశపెట్టాయి. ఈ ప్రతిపాదనకు మార్చి 13వ తేదీ తుది గడువుగా నిర్ణయించగా సరిగ్గా 13వ తేదీ గడువు ముగిసే అర గంట ముందు సాంకేతిక కారణాలను సాకుగా చూపించి చైనా అడ్డు తగిలింది.
 
ఈ సాంకేతిక కారణాలకు సాకుగా చూపి చైనా మరో ఆరు నెలల పాటు మసూద్‌ను ఉగ్రవాదిగా ప్రకటించకుండా ఆపగలుగుతుంది. ఆపై మరో మూడు నెలల వరకు కూడా పొడిగించవచ్చు. ఇప్పటికే తనకున్న వీటో అధికారంతో చైనా 3 సార్లు మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా అడ్డుకోగా ఇది నాలుగవసారి కావడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

Allu Aravind: పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ సవాల్ - టైం ఇస్తే వారితో సినిమా చేస్తా

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments