Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోటళ్లలో డబ్బుతో పనిలేదు... అంతా కార్డుల మయం..!

Webdunia
మంగళవారం, 3 మార్చి 2015 (18:16 IST)
దేశంలో నల్లధనాన్ని అరికట్టేందుకు, నగదు లావాదేవీలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న రీతిలో కొత్త చర్యలను చేపడుతోంది. ఇందులో భాగంగా ఇక మీదట దేశంలో ఉన్న ఎక్కడి ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లకు వెళ్లినా, అక్కడ డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు. హోటల్ బిల్లుకైనా, దూర ప్రాంత విమానం టిక్కెట్, లగ్జరీ కార్లు అద్దెకు తీసుకోవాలన్నా, ఖరీదైన విలాస వస్తువులు కొనాలన్నా అన్నిటికీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల ద్వారానే చెల్లింపులు జరపాలు.
 
హై వాల్యూ లావాదేవీలపై దృష్టిని సారించిన కేంద్రం నల్ల ధనాన్ని అరికట్టేందుకు ఈ మేరకు నిర్ణయాలు ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఒక పరిధి దాటిన తరువాత చెల్లింపులన్నీ బ్యాంకు మాధ్యమంగానే జరగాలన్న నిబంధన అమలులోకి రానుంది. బ్లాక్ మనీని ఆపాలంటే నగదు లావాదేవీలు గణనీయంగా తగ్గాల్సివుందని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆర్థిక శాఖకు సిఫార్సులు సమర్పించిన నేపథ్యంలో నగదు లావాదేవీలకు పరిమితి పెట్టాలని భావించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments