Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజౌరీ సెక్టార్‌లో పాక్ సైనికుల బుల్లెట్ల వర్షం... నలుగురు సైనికుల మృతి

శత్రుదేశం పాకిస్థాన్ మరోమారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత ఆర్మీ సెక్టార్‌పై తూటాల వర్షం కురిపించింది. ఈ ఘటనలో ఓ ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు అమరులయ్యారు. జమ్మూకాశ్మీర్‌లోని రాజౌర

Webdunia
సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (09:03 IST)
శత్రుదేశం పాకిస్థాన్ మరోమారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత ఆర్మీ సెక్టార్‌పై తూటాల వర్షం కురిపించింది. ఈ ఘటనలో ఓ ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు అమరులయ్యారు. జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌లో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. 
 
పాక్ కాల్పుల్లో అమరులైన వారిలో ఆర్మీ సెంకెండ్ ఆఫీసర్ కెప్టెన్ కపిల్ కుందు ఉన్నారు. నలుగురు స్థానికులు గాయపడ్డారు. గత 40 రోజులుగా పాక్ జరుపుతున్న కాల్పుల్లో ఆర్మీ అధికారి చనిపోవడం ఇది రెండోసారి.
 
పాక్ కాల్పులతో విరుచుకుపడుతుండటంతో రాజౌరీ సెక్టార్‌లో సరిహద్దుకు సమీపంలో ఉన్న 84 పాఠశాలలను మూసివేయించారు. మూడు రోజుల వరకు సెలవులు ప్రకటించారు. అలాగే సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
 
పాక్ కాల్పుల్లో అమరులైన వారిలో మిగతా వారిని రైఫిల్ మ్యాన్‌లు రామ్ అవతార్, శుభం సింగ్, హవల్దార్ రోషన్ లాల్, జవాను నియాక్ ఇక్బాల్ అహ్మద్‌లుగా గుర్తించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments