Webdunia - Bharat's app for daily news and videos

Install App

బురుండీ దేశాధ్యక్షుడు కురుంజిజా మృతి.. కరోనా కారణమా?

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (14:35 IST)
Burundi president
ఆఫ్రికాఖండ దేశమైన బురుండీ దేశాధ్యక్షుడు ఎన్ కురుంజిజా ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందారు. ఇటీవలే అనారోగ్యం బారిన పడి కోలుకున్నప్పటికీ.. చనిపోయినట్లు ప్రభుత్వం తెలిపింది. ఆకస్మిక గుండెపోటుతోనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు ప్రభుత్వం చెబుతున్నా కరోనాతోనే చనిపోయి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన భార్యకు కూడా కరోనా సోకడం ఈ అనుమానాలకు బలమిస్తోంది.
 
55 ఏళ్ల కురుంజిజా శనివారం ఆస్పత్రిలో చేరి, సోమవారానికల్లా కోలుకున్నాడు. మంగళవారం అనూహ్యంగా గుండెపోటు వచ్చిందని, ఎన్ని ప్రయత్నాలు చేసినా బతికించలేకపోయామని వైద్యులు చెప్తున్నారు. కురుంజిజా భార్య డెనిస్‌కు ప్రస్తుతం కెన్యాలోని అగాఖాన్ యూనివర్శిటీ హాస్పిటల్‌లో కరోనాకు చికిత్స పొందుతున్నారు. బురుండీలో ఇప్పటివరకు 83 కరోనా కేసులు నమోదు కాగా ఒకరు మాత్రమే మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments