బాయ్‌కాట్ ఇండియా కాదు.. ముందు మీ భార్యల చీరలు తగలబెట్టండి..!!

ఠాగూర్
మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (14:49 IST)
బాయ్‌కట్ ఇండియా కాదు... ముందు భారతదేశంలో కొనుగోలు చేసి తెచ్చుకుని మీ భార్యలు ధరిస్తున్న చీరలను తగలబెట్టాలని తమ దేశంలోని ప్రతిపక్ష పార్టీల నేతలకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా పిలుపునిచ్చారు. భారత్‌ను ఆమె గొప్ప స్నేహితుడుగా అభివర్ణించారు. బంగ్లాదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ) 'బాయ్‌కాట్ ఇండియా' అనే నినాదంతో ముందుకు సాగుతుంది. దేశంలో భారత వ్యతిరేక సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ విపక్ష నేతలపై ఆమె మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ బీఎన్పీ నేతలు తొలుత వారి భార్యల వద్ద ఉన్న భారత చీరలను తగలబెట్టాలని డిమాండ్ చేశారు. బీఎన్పీ అధికారంలో ఉన్నపుడు వారి భార్యలు భారత్‌కు వెళ్లి మరీ అక్కడి చీరలు కొనుగోలు చేయడం తనకు తెలుసన్నారు. అక్కడ కొనుగోలు చేసిన చీరలను వారు బంగ్లాదేశ్‌లో అమ్ముకునే వారన్నారు. భారత్ నుంచి గరమ్ మసాలా, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి వంటి ఉత్పత్తులు కూడా వస్తున్నాయని, అవి లేకుండా బీఎన్పీ నాయకులు ఎందుకు వండుకోకూడదని ప్రశ్నించారు. భారత్ నుంచి దిగుమతి అయ్యే మసాలాలు లేకుండా వారు వంటలు చేసుకోవాలని సూచించారు. ఇవి లేకుండా వారు ఆహారం తినగలరా అని ప్రధాన షేక్ హసీనా ప్రశ్నించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments