Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాయ్‌కాట్ ఇండియా కాదు.. ముందు మీ భార్యల చీరలు తగలబెట్టండి..!!

ఠాగూర్
మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (14:49 IST)
బాయ్‌కట్ ఇండియా కాదు... ముందు భారతదేశంలో కొనుగోలు చేసి తెచ్చుకుని మీ భార్యలు ధరిస్తున్న చీరలను తగలబెట్టాలని తమ దేశంలోని ప్రతిపక్ష పార్టీల నేతలకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా పిలుపునిచ్చారు. భారత్‌ను ఆమె గొప్ప స్నేహితుడుగా అభివర్ణించారు. బంగ్లాదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ) 'బాయ్‌కాట్ ఇండియా' అనే నినాదంతో ముందుకు సాగుతుంది. దేశంలో భారత వ్యతిరేక సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ విపక్ష నేతలపై ఆమె మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ బీఎన్పీ నేతలు తొలుత వారి భార్యల వద్ద ఉన్న భారత చీరలను తగలబెట్టాలని డిమాండ్ చేశారు. బీఎన్పీ అధికారంలో ఉన్నపుడు వారి భార్యలు భారత్‌కు వెళ్లి మరీ అక్కడి చీరలు కొనుగోలు చేయడం తనకు తెలుసన్నారు. అక్కడ కొనుగోలు చేసిన చీరలను వారు బంగ్లాదేశ్‌లో అమ్ముకునే వారన్నారు. భారత్ నుంచి గరమ్ మసాలా, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి వంటి ఉత్పత్తులు కూడా వస్తున్నాయని, అవి లేకుండా బీఎన్పీ నాయకులు ఎందుకు వండుకోకూడదని ప్రశ్నించారు. భారత్ నుంచి దిగుమతి అయ్యే మసాలాలు లేకుండా వారు వంటలు చేసుకోవాలని సూచించారు. ఇవి లేకుండా వారు ఆహారం తినగలరా అని ప్రధాన షేక్ హసీనా ప్రశ్నించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments