Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ బాలుడు భారత్‌లోకి వచ్చాడు.. సురక్షితంగా చేర్చిన బీఎస్ఎఫ్!

Webdunia
సోమవారం, 22 డిశెంబరు 2014 (11:32 IST)
పాకిస్థాన్‌కు చెందిన నాలుగేళ్ళ బాలుడు అలీ సజ్జన్ గోహర్ దారితప్పి, పొరపాటున భారత భూభాగంలోకి ప్రవేశించాడు. ఈ విషయాన్ని గుర్తించిన భారత సరిహద్దు దళం (బీఎస్ఎస్) ఆ బాలుడుని సురక్షితంగా పాక్ సరిహద్దు బలగాలకు అప్పగించింది. ఈ సంఘటన విఘాకోట్ - గుజరాత్ సరిహద్దుల్లో చోటు చేసుకుంది. 
 
‘శుక్రవారం రాత్రి బోర్డర్‌లో తచ్చాడుతున్న పిల్లాడు జవాన్ల కంటపడ్డాడు. పాక్ సైన్యానికి సమాచారం అందించి, పిల్లాడ్ని తల్లిదండ్రులకు అందించాం' అని భుజ్ రేంజ్ బిఎస్‌ఎఫ్ డిప్యూటీ కమాండర్ హిమాంశు గౌర్ వెల్లడించారు.పాక్ సింధ్ ప్రాంతంలోని బదిన్ జిల్లాకు చెందిన దండారి గ్రామవాసిగా పిల్లాడ్ని గుర్తించారు. 
 
భారత్‌వైపు వంద అడుగుల దూరం వచ్చేసిన పిల్లాడు సింధీ తప్ప మరేమీ మాట్లాడలేకపోవడంతో, వివరాలు తెలుసుకోవడం జవాన్లకు కష్టమే అయ్యింది. పాక్ సైన్యంతో ఫ్లాగ్ సమావేశం నిర్వహించిన అనంతరం పిల్లాడ్ని అప్పగించారు. భారత జవాన్లు ప్రదర్శించిన మానవతా దృక్ఫదానికి పాక్ బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. 

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

Show comments