ఇంట్లో నుంచి లేచిపోయిందనీ అన్నతో చెల్లెల్ని కాల్పించారు!
ఆప్ఘనిస్థాన్లో దారుణం జరిగింది. ఓ యువతి ఇంట్లో నుంచి ఓ యువకుడితో లేచిపోయిందనీ తాలిబన్ తీవ్రవాదులు సొంత అన్నతో కాల్చి చంపించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆప్ఘనిస్థాన్ దేశంలోని కోహిస్థనాత్ జిల్లా
ఆప్ఘనిస్థాన్లో దారుణం జరిగింది. ఓ యువతి ఇంట్లో నుంచి ఓ యువకుడితో లేచిపోయిందనీ తాలిబన్ తీవ్రవాదులు సొంత అన్నతో కాల్చి చంపించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆప్ఘనిస్థాన్ దేశంలోని కోహిస్థనాత్ జిల్లాలో జరిగిన ఈ విషాద వివరాలను పరిశీలిస్తే..
కుటుంబ కలహాల కారణంగా 19 ఏళ్ల ఆజాదా అనే యువతి రెండు నెలల క్రితం ఇంట్లో నుంచి పారిపోయింది. ఇటీవల ఓ చోట గుర్తించిన ఆమె సోదరుడు నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న తాలిబన్ తీవ్రవాదులు ఆగ్రహంతో రగిలిపోయారు.
కాగా సోమవారం అందరూ చూస్తుండగానే యువతి సోదరుడు, తాలిబన్ ఉగ్రవాదులు ఆమెను కాల్చి చంపారు. మహిళలను ఇలా బహిరంగంగా చంపేయడం తాలిబన్లకు కొత్తేంకాదు. ఫోన్లో తెలియని వ్యక్తితో మాట్లాడుతుందన్న ఆరోపణలతో 22 ఏళ్ల మహిళను ఇటీవల ఆమె బంధువుల చేతనే దారుణంగా చంపించిన విషయం తెల్సిందే.