Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటలీలో ఘోర ప్రమాదం - ప్రముఖ బ్రిటన్ వ్యాపారవేత్త మైక్ చింగ్ గల్లంతు

ఠాగూర్
మంగళవారం, 20 ఆగస్టు 2024 (11:19 IST)
ఇటలీ దేశంలో ఘోర ప్రమాదం సంభవించింది. సిసిలీ తీర ప్రాంతంలో తీవ్ర తుఫాను సంభవించింది. దీంతో ఓ లగ్జరీ నౌక మునిగిపోయింది. ఈ ప్రమాద సమయంలో అందులో ప్రయాణిస్తున్న బ్రిటన్ దిగ్గజ వ్యాపారవేత్త మైక్ లించ్ సహా ఏడుగురు గల్లంతు అయ్యారు. సిసిలియన్ పోర్టు నుండి ఈయాట్‌‍కు ఈ నెల 14న బయలుదేరిన నౌకలో పది మంది సిబ్బంది, 12 మంది ప్రయాణికులు ఉన్నారు. 
 
పోర్టిసెల్లో తీరానికి చేరుకున్న సమయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా షిప్ మునిగిపోయినట్లు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగి, నౌకను బయటకు తీసే ప్రయత్నాలు చేశాయి. ఈ ప్రమాదంలో బ్రిటన్ వ్యాపార దిగ్గజం మైక్ లించ్ గల్లంతు కాగా, ఆయన భార్యతో పాటు మరో 14 మంది ప్రమాదం నుండి బయటపడ్డారు.
 
ఈ ప్రమాదంలో గల్లంతైన వారిలో నలుగురు బ్రిటిషర్లు, ఇద్దరు అమెరికన్లు, ఒక కెనడియన్ ఉన్నట్లు ఇటలీ అధికారులు తెలిపారు. వీరిలో ఒకరి మృతదేహాన్ని బయటకు తీశారు.
 
కాగా, గల్లంతైన వ్యాపారవేత్త మైక్ లించ్ (59) అమెరికాలో మోసం కేసులో ఇటీవలే నిర్దోషిగా బయటపడ్డారు. ఆయన 1990లో టెక్ దిగ్గజ సంస్థ ఆటానమీ కార్పోరేషన్‌ను ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నైలో ఓ వీధికి గానగంధర్వుడి పేరు : సీఎం స్టాలిన్ ఆదేశాలు

దేవర సెన్సార్ రిపోర్ట్ వచ్చాకే ట్రిమ్ చేశారు? దేవర ప్రివ్యూ రిపోర్ట్

వైవిధ్యం పేరుతో ప్రభాస్ తో ప్రయోగాలు చేస్తున్న దర్శకులు

విడాకుల కోసం కోర్టుకెక్కిన 'రంగేలీ' భామ

సిటాడెల్ హనీ బన్నీ ప్రీమియర్ షోకు హాజరైన సమంత, ప్రియాంక చోప్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

ప్రతిరోజూ 3-5 కప్పుల కాఫీ తీసుకుంటే.. అంత మేలు జరుగుతుందా?

బత్తాయి రసంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏంటి?

4 సంవత్సరాల బాలుడికి ప్రాణాలను రక్షించే కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

తేనెతో డైరెక్ట్ ప్యాక్ వద్దు.. అలోవెరా జెల్, రోజ్ వాటర్‌తోనే?

తర్వాతి కథనం
Show comments