Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీకి అరుదైన గౌరవం: నేపాల్ ప్రధాని ప్రొటోకాల్ ఉల్లంఘన!

Webdunia
మంగళవారం, 29 జులై 2014 (17:58 IST)
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం దక్కనుంది. నేపాల్ పర్యటనకు వెళ్లనున్న నరేంద్ర మోడీని ఆహ్వానించేందుకు నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాల సిద్ధమవుతున్నారు. నేపాల్ ప్రధాన మంత్రి సుశీల్ కోయిరాల ప్రొటోకాల్ నియమాలను సైతం పక్కనబెట్టి మోడీకి స్వయంగా స్వాగతం పలకనున్నారు.
 
రెండు రోజుల పర్యటన కోసం ఆగస్టు 3న నేపాల్కు వెళ్లనున్న మోడీకి త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏడుగురు మంత్రులు, సీనియర్ అధికారులు, పారిశ్రామిక వేత్తలతో కూడిన 101 మంది ప్రతినిధుల బృందం మోడీకి స్వాగతం పలకనున్నారు. 
 
ప్రధాని సుశీల్ కోయిరాల కూడా విమానాశ్రయానికి రానున్నారు. దీన్ని బట్టి మోడీ పర్యటనకు నేపాల్ ఎంతటి ప్రాధాన్యం ఇస్తుందో అర్థం చేసుకోవచ్చని కోయిరాల సలహాదారు దినేశ్ భట్టారాయ్ పేర్కొన్నారు.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments