Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను చంపి అది కోసి పెనంపై కాల్చి ఫ్రై చేసిన భార్య, ఎక్కడ?

Webdunia
సోమవారం, 14 జూన్ 2021 (18:05 IST)
బ్రెజిల్‌కు చెందిన ఒక మహిళ తన భర్తను దారుణంగా హత్య చేసింది. ఆ తరువాత అతని మర్మాంగాన్ని కోసేసింది. అంతేకాదు కోసేసిన మర్మాంగాన్ని వంట చేసింది. ఈ దారుణానికి పాల్పడిన 33యేళ్ళ మహిళను అరెస్టు చేశారు పోలీసులు.
 
మృతుడు మచాడో  విగతజీవిగా పడి ఉండడాన్ని పోలీసులు గమనించారు. పోలీసులు చెప్పిన వివరాలు ప్రకారం భార్య శాంతాకిటారియా భర్త మర్మాంగాన్ని కోసేసి పెనం మీద నూనెలో వేసి వేయించిందట. ఉదయం 4 గంటల సమయంలో ఈ దారుణం జరిగి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు.
 
ఆస్తి విషయంలో జరిగిన గొడవ కారణంగానే శాంతా కిటారియా ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. నిందితురాలు ఉపయోగించిన వంటగదిలోని కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యతో పాటు వేధింపుల కేసులో శాంతా కిటారియాను పోలీసులు అరెస్టు చేశారు. పదేళ్ళపాటు కలిసి ఉన్నారు వీరిద్దరు. 
 
వీరిద్దరికి 8 యేళ్ళ కూతురు, ఐదేళ్ళ కొడుకు ఉన్నారు. అయితే ఈ ఘాతుకం జరిగిన సమయంలో బాధితులు అక్కడే ఉన్నారా అన్న విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన ముందురోజు రాత్రి వీరిద్దరు బార్‌కు వెళ్ళి పూటుగా మద్యం సేవించినట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments