అఫ్ఘానిస్థాన్లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి జరిపారు. వాలీబాల్ టోర్నమెంట్ను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 50 మంది మృతి చెందగా.. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని పక్తికా ప్రావిన్స్లోన ఉన్న యాహ్యా ఖైల్లో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ జరుగుతుండగా, అక్కడికి మోటార్ సైకిల్పై వచ్చిన ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు.
గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని డిప్యూటీ గవర్నర్ అతావుల్లా ఫజిల్ వెల్లడించారు
అయితే ఈ ఆత్మాహుతి దాడికి సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత ప్రకటించుకోలేదు. దేశంలో అత్యంత క్లిష్టమైన పక్తికా ప్రాంతంలో గత జూలైలోనూ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడిలో 41 మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే.