Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొరుగు దేశాలను తాకిన ఉల్లిఘాటు... కిలో రూ.220

Webdunia
సోమవారం, 18 నవంబరు 2019 (11:52 IST)
దేశ వ్యాప్తంగా ఉల్లిపాయల రేటు ఆకాశానికి తాకింది. ఈ ఘాటు పొరుగు దేశాలను కూడా తాకింది. ఫలితంగా ఆ పొరుగు దేశాల్లో కిలో ఉల్లిపాయల రేటు వందల రూపాయలకు పెరిగిపోయింది. 
 
దేశ వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉల్లిపాయల దిగుబడి తగ్గిపోవడంతో ఉల్లిపాయల రేటు విపరీతంగా పెరిగిపోయిన విషయం తెల్సిందే. విదేశాల నుంచి లక్షల టన్నుల ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంటున్నప్పటికీ ధర మాత్రం ఏమాత్రం దిగిరావడం లేదు. ఫలితంగా దేశంలోనే కిలో ఉల్లిపాయల ధర రూ.75 నుంచి రూ.100 పలుకుతోంది. 
 
ఇకపోతే, భారత్‌ ఎగుమతులపై ఆధారపడిన బంగ్లాదేశ్ వంటి దేశాల్లో వీటి రేటు వందల రూపాయలకు చేరింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో కిలో ఉల్లిపాయల ధర రూ.220కు చేరింది. దీంతో ఆ దేశ ప్రభుత్వం విమానాల ద్వారా టర్కీ, ఈజిప్ట్, చైనా నుంచి ఉల్లి దిగుమతి చేసుకుంటూ ఉల్లి ధరలు తగ్గించే ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
 
పలు ప్రాంతాల్లో ఉల్లి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి కిలో ఉల్లి రూ.38కి అందించే ప్రయత్నాలు చేస్తోంది. ఉల్లి ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో తన ఇంట్లో కూరల్లో ఉల్లిని వాడద్దంటూ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్‌ హసినా నిర్ణయం తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

ప్రేమించడం లేదా అన్నది తన వ్యక్తిగతం : సమంత

Samantha: ఇంకోసారి ప్రేమలో పడి ఆలోచనే సమంతకు లేదా? జెస్సీ రోల్ అంటే చాలా ఇష్టం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

తర్వాతి కథనం
Show comments