Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొరుగు దేశాలను తాకిన ఉల్లిఘాటు... కిలో రూ.220

Webdunia
సోమవారం, 18 నవంబరు 2019 (11:52 IST)
దేశ వ్యాప్తంగా ఉల్లిపాయల రేటు ఆకాశానికి తాకింది. ఈ ఘాటు పొరుగు దేశాలను కూడా తాకింది. ఫలితంగా ఆ పొరుగు దేశాల్లో కిలో ఉల్లిపాయల రేటు వందల రూపాయలకు పెరిగిపోయింది. 
 
దేశ వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉల్లిపాయల దిగుబడి తగ్గిపోవడంతో ఉల్లిపాయల రేటు విపరీతంగా పెరిగిపోయిన విషయం తెల్సిందే. విదేశాల నుంచి లక్షల టన్నుల ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంటున్నప్పటికీ ధర మాత్రం ఏమాత్రం దిగిరావడం లేదు. ఫలితంగా దేశంలోనే కిలో ఉల్లిపాయల ధర రూ.75 నుంచి రూ.100 పలుకుతోంది. 
 
ఇకపోతే, భారత్‌ ఎగుమతులపై ఆధారపడిన బంగ్లాదేశ్ వంటి దేశాల్లో వీటి రేటు వందల రూపాయలకు చేరింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో కిలో ఉల్లిపాయల ధర రూ.220కు చేరింది. దీంతో ఆ దేశ ప్రభుత్వం విమానాల ద్వారా టర్కీ, ఈజిప్ట్, చైనా నుంచి ఉల్లి దిగుమతి చేసుకుంటూ ఉల్లి ధరలు తగ్గించే ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
 
పలు ప్రాంతాల్లో ఉల్లి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి కిలో ఉల్లి రూ.38కి అందించే ప్రయత్నాలు చేస్తోంది. ఉల్లి ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో తన ఇంట్లో కూరల్లో ఉల్లిని వాడద్దంటూ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్‌ హసినా నిర్ణయం తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments