Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కరోనా విలయం : సరిహద్దులను మూసివేసిన బంగ్లాదేశ్

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2021 (11:53 IST)
భారత్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దీంతో పొరుగు దేశమైన బంగ్లాదేశ్ తమ దేశ సరిహద్దులను మూసివేసింది. తద్వారా భారత్ నుంచి ఎలాంటి రాకపోకలు లేకుండా చేసింది. 
 
ప్రస్తుతం దేశంలో రోజుకు మూడు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి నేపథ్యంలో ఇప్పటికే విమాన రాకపోకలను నిలిపివేసిన బంగ్లాదేశ్.. తాజాగా భూ మార్గాన్ని కూడా మూసేస్తున్నట్టు ప్రకటించింది. 
 
భారత్‌తో ఉన్న భూ సరిహద్దును రెండు వారాలపాటు మూసేస్తున్నట్టు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్ ఆదివారం రోజు ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 26 (ఈ రోజు) నుంచే ఈ ఆదేశాలు అమలు రానున్నట్టు వెల్లడించారు. అయితే సరకు రవాణా వాహనాలను మాత్రం తమ దేశంలోకి అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు. 
 
ఇదిలా ఉంటే.. మల్దీవులకు చెందిన పర్యాటక మంత్రిత్వశాఖ కూడా సోమవారం కీలక ప్రకటన చేసింది. ‘భారతదేశం నుంచి మాల్దీవులకు వచ్చే పర్యాటకులు జనావాస ద్వీపాల్లోని పర్యటక కేంద్రాల్లో ఉండటాన్ని నిషేధిస్తున్నాం. ఈ ఆదేశాలు రేపటి నుంచి అమలులోకి వస్తాయి’  అని ట్విట్టర్ ద్వారా తెలిపింది. భారత్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

Mahesh Babu: రేపటి నుంచి ఒరిస్సా లో రాజమౌళి, మహేశ్‌బాబు సినిమా షూటింగ్‌ - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

తర్వాతి కథనం
Show comments