Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కరోనా విలయం : సరిహద్దులను మూసివేసిన బంగ్లాదేశ్

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2021 (11:53 IST)
భారత్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దీంతో పొరుగు దేశమైన బంగ్లాదేశ్ తమ దేశ సరిహద్దులను మూసివేసింది. తద్వారా భారత్ నుంచి ఎలాంటి రాకపోకలు లేకుండా చేసింది. 
 
ప్రస్తుతం దేశంలో రోజుకు మూడు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి నేపథ్యంలో ఇప్పటికే విమాన రాకపోకలను నిలిపివేసిన బంగ్లాదేశ్.. తాజాగా భూ మార్గాన్ని కూడా మూసేస్తున్నట్టు ప్రకటించింది. 
 
భారత్‌తో ఉన్న భూ సరిహద్దును రెండు వారాలపాటు మూసేస్తున్నట్టు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్ ఆదివారం రోజు ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 26 (ఈ రోజు) నుంచే ఈ ఆదేశాలు అమలు రానున్నట్టు వెల్లడించారు. అయితే సరకు రవాణా వాహనాలను మాత్రం తమ దేశంలోకి అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు. 
 
ఇదిలా ఉంటే.. మల్దీవులకు చెందిన పర్యాటక మంత్రిత్వశాఖ కూడా సోమవారం కీలక ప్రకటన చేసింది. ‘భారతదేశం నుంచి మాల్దీవులకు వచ్చే పర్యాటకులు జనావాస ద్వీపాల్లోని పర్యటక కేంద్రాల్లో ఉండటాన్ని నిషేధిస్తున్నాం. ఈ ఆదేశాలు రేపటి నుంచి అమలులోకి వస్తాయి’  అని ట్విట్టర్ ద్వారా తెలిపింది. భారత్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిష్ వెంకట్ కుటుంబానికి నేనున్నా.. రూ.1.5 లక్షలు ఇచ్చిన సోనూ సూద్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments