Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాకు సహనం కత్తులు ఉన్నాయ్, మోడీకి ధైర్యం ఉంటే పాక్ ఆర్మీతో తలపడాలి : బెలూన్లతో బెదిరింపులు

ఓర్పు - సహనం వదిలేస్తే ఏమవుతుందో రుచి చూపిస్తూ, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ చేసిన మెరుపుదాడిలో సుమారు 40 నుంచి 70 మంది ఉగ్రవాదులు మృతి చెందిన విషయం తెలిసిందే. భారత వీర సైని

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (12:19 IST)
ఓర్పు - సహనం వదిలేస్తే ఏమవుతుందో రుచి చూపిస్తూ, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ చేసిన మెరుపుదాడిలో సుమారు 40 నుంచి 70 మంది ఉగ్రవాదులు మృతి చెందిన విషయం తెలిసిందే. భారత వీర సైనికులు సరిహద్దులు దాటి, తమ భూభాగానికి వచ్చి ఉగ్రమూకలను నాశనం చేసి వెళతారని ఊహించలేక పోయిన పాక్, జరిగిన నష్టానికి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆలోచనలో నిమగ్నమై ఉంది. 
 
ప్రస్తుతానికి పగ తీర్చుకునే మార్గం కనిపించక, సరిహద్దులకు ఆవలివైపు నుంచి బెలూన్లకు బెదిరింపు లేఖలు కట్టి వదులుతోంది. పంజాబ్‌లోని దీనానగర్‌లో గాలిలో ఎగురుకుంటూ వచ్చిన రెండు బెలూన్లు అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. 'మా దగ్గర సహనం కత్తులు ఉన్నాయ్, మోడీకి ధైర్యం ఉంటే పాక్ ఆర్మీ సత్తా ఎంటో నేరుగా తలపడి చూసుకోవాలి' అంటూ పలు రకాల హెచ్చరికలను కాగితాలపై రాసి వాటిని బెలూన్లకు స్టిక్కర్లతో అంటించి విడిచి పెట్టినట్టు గుర్తించారు. అలాగే భారత భద్రతా బలగాలు, మహిళల పట్ల అసభ్య వ్యాఖ్యలు కూడా వాటిపై ఉన్నాయి. 
 
ఆ బెలూన్లకు ఉర్దూలో రాసిన ఏదో సందేశం అతికించి ఉండటంతో ఆందోళన చెందిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చా రు.  పోలీసులు అక్కడికి చేరుకొని పసుపుపచ్చ రంగులో ఉన్న బెలూన్లను, వాటికి ఉన్న లేఖను స్వాధీనం చేసుకున్నారు. భారత ప్రధాని మోడీని ఉద్దేశించి రాసిన లేఖలు కొన్ని గత సంవత్సరం ఉగ్రదాడి జరిగిన దినానగర్ ప్రాంతంలోని ఘేసాల్ గ్రామం వద్ద కనిపించాయి. వీటిపై ఉర్దూలో, భారత్ జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఉంది. వీటిపై "మోడీజీ... అయూబీ తల్వార్‌లు ఇంకా మా దగ్గరే ఉన్నాయి. ఇస్లాం వర్థిల్లాలి" అని కూడా ఉంది. కాగా, ఇక్కడికి సమీపంలోని జాండే చాక్ గ్రామంలో పాకిస్థాన్ జెండా ముద్రించి, దానిపై 'ఐ లవ్ పాకిస్థాన్' అని రాసున్న మరో బెలూన్ కూడా దర్శనమిచ్చింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments