Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్లిక్ టాయ్‌లెట్‌‌లో పసిబిడ్డ జననం... వదిలేసిన కసాయి తల్లి...

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2015 (15:42 IST)
అప్పుడే పుట్టిన పసిబిడ్డను పబ్లిక్ టాయ్‌లెట్‌లో వదిలేసి వెళ్లింది ఓ కసాయి తల్లి. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. చైనా దేశ రాజధాని నగరం బీజింగ్‌లో పుట్టి కొన్ని గంటలే అయిన పసి కందును గుర్తుతెలియని మహిళ పబ్లిక్ టాయ్‌లెట్‌లో వదిలేసి వెళ్లింది. ఆ పసి బిడ్డ ఏడుపు శబ్దం విన్న స్థానికులు లోపలికి వెళ్లి చూసి, దిగ్భ్రాంతికి గురైయ్యారు. ఆ మహిళ బిడ్డను టాయ్‌లెట్‌లోనే ప్రసవించి, వదిలేసినట్లు తెలిసింది.
 
అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఆ పసి బిడ్డను స్వాధీనం చేసుకుని శిశు సంక్షేమ సంఘానికి తరలించారు. చైనాలో ఒక బిడ్డను మాత్రమే కనాలనే చట్టం అమలులో ఉండడంతో ఇటువంటి సంఘటనలు అనేకం జరుగుతున్నట్టు తెలుస్తోంది. రెండో సారి గర్భవతులయ్యే మహిళలు ఈ విధంగా పిల్లలను ప్రసవించి వదిలేసి వెళుతున్నట్టు తెలుస్తోంది. 
 
ఇదే విధంగా పెళ్లి కాకుండానే తల్లులు అయ్యే మహిళలు, కొన్ని సందర్భాలలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా కూడా పుట్టిన బిడ్డలను అనాధగా వదిలే వెళుతున్నట్టు తెలుస్తోంది. పోలీసులు ఆ పసి బిడ్డ తల్లిదండ్రుల కోసం గాలిస్తున్నారు. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments