Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎగిరే విమానంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ..!

Webdunia
సోమవారం, 8 జూన్ 2020 (17:39 IST)
ఎగురుతున్న విమానంలో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మనీలాకు చెందిన ఓ మహిళ ముప్పై అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానంలో మగబిడ్డను ప్రసవించింది.

వివరాల్లోకి వెళితే.. జూన్ 6న దుబాయ్‌ నుంచి మనీలాకు బయల్దేరిన ఫిలిప్పీన్స్ ఎయిర్ లైన్స్‌కు చెందిన పీఆర్659 విమానంలో ప్రయాణిస్తున్న గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో విమాన సిబ్బంది ఈ విషయాన్ని ఎయిర్‌లైన్ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు వెంటనే స్పందించి డాక్టర్‌ను సంప్రదించారు.
 
ఈ నేపథ్యంలో శాటిలైట్ ఫోన్ ద్వారా డాక్టర్ ఇచ్చిన సూచనల ప్రకారం విమానం సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి.. ఆ మహిళకు కాన్పు చేశారు. కాగా.. 30వేల అడుగుల ఎత్తులో పుట్టిన శిశువుకు స్వాగతం పలికిన విమాన సిబ్బంది.. ఆ క్షణాలను సెలబ్రేట్ చేసుకున్నారు. పుట్టిన శిశువుతో ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడికెళ్లినా ఆ దిండుతో పాటు జాన్వీ కపూర్ ప్రయాణం.. ఎందుకు?

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌: ఈడీ ముందు హాజరైన రానా దగ్గుబాటి

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

భార్య చీపురుతో కొట్టిందన్న అవమానంతో టీవీ నటుడి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments