Webdunia - Bharat's app for daily news and videos

Install App

మతిమరుపు రోగులకు ఓ గ్రామం...

మతిమరుపు(డెమెన్షియా) రోగుల కోసం ఓ గ్రామం నిర్మితమవుతోంది. ఇందుకోసం సుమారు రూ.128 కోట్లను ఖర్చు చేయనుంది. ఈ నిధులతో సకల సదుపాయాలను కల్పించనుంది. ఈ తరహా గ్రామాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్న దేశం ఆస

Webdunia
సోమవారం, 24 జులై 2017 (09:32 IST)
మతిమరుపు(డెమెన్షియా) రోగుల కోసం ఓ గ్రామం నిర్మితమవుతోంది. ఇందుకోసం సుమారు రూ.128 కోట్లను ఖర్చు చేయనుంది. ఈ నిధులతో సకల సదుపాయాలను కల్పించనుంది. ఈ తరహా గ్రామాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్న దేశం ఆస్ట్రేలియా. ఈ డెమెన్షియా విలేజ్‌లో 90 ఇళ్లు నిర్మించనున్నారు. అలాగే 18 నెలల్లోనే ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. 
 
దక్షిణ టాస్మేనియాలోని హోల్‌బాట్‌లో నిర్మించనున్న ‘డెమెన్షియా విలేజ్’లో 15 దర్జీ ఇళ్లతోపాటు సూపర్ మార్కెట్, సినిమా, కేఫ్, బ్యూటీ సెలూన్, గార్డెన్ తదితరాలు కూడా ఉంటాయి. మతిమరుపు రోగులు పూర్తి స్వేచ్ఛగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ గ్రామాన్ని నిర్మిస్తున్నారు. గ్రామంలో నివసించే వారు సామాజిక కార్యక్రమాలు సహా అన్నింటిలోనూ పాల్గొనేలా దీనిని తీర్చిదిద్దనున్నారు.
 
కాగా, నెదర్లాండ్స్‌లో ఇప్పటికే ఇటువంటి గ్రామం ఒకటి ఉంది. 2009లో డి హోగెవెక్‌లో మతిమరుపు రోగుల కోసం ప్రత్యేకంగా ఓ గ్రామాన్ని నిర్మించింది. ఎనిమిదేళ్లుగా ఇక్కడ నివసిస్తున్న రోగుల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ఇటువంటి గ్రామమే ఐర్లాండ్‌లో నిర్మితమవుతోంది. ఇక్కడ కూడా కేఫ్, బ్యూటీ సెలూన్, జిమ్, గార్డెన్లు తదితర వాటిని నిర్మిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments