Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయుధమూకల నరమేథం... 160 మంది మృతి.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2023 (08:25 IST)
సెంట్రల్ నైజీరియాలో నరమేథం జరిగింది. సామూహిక మూకలు ఈ దారుణానికి పాల్పడ్డాయి. కొన్ని తెగల ప్రజలే లక్ష్యంగా గ్రామాలపై కాల్పులతో సాయుధ మూకలు విరుచుకుపడ్డారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం వరకు కొనసాగిన ఈ కాల్పుల్లో ఏకంగా 160 మంది మృతి చెందారు. ఈ నరమేథ హంతకులు ఇళ్లలోకి దూరి, చిత్రహింసలకు గురిచేసి ఆపై కాల్చి చంపేశారు. 
 
సెంట్రల్ నైజీరియాలోని బండిట్స్‌గా పలిచే కొన్ని సాయుధ సమూహాలు ఈ అరాచకానికి పాల్పడ్డాయి. పలు గ్రామాల ప్రజలే లక్ష్యంగా కాల్పులు జరిపాయి. కాల్పులతో నరమేథం సృష్టించాయి. వరుస కాల్పుల్లో 160 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టుగా స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కాల్పుల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, సోమవారం కూడా కాల్పులు కొనసాగడంతో ఈ మృతుల సంఖ్య ఒక్కసారిగా పెగిపోయింది. దాదాడు 300 మంది వరకు గాయపడగా, మొత్తం మృతుల సంఖ్య 160కి చేరింది. 
 
కొన్ని తెగలకు చెందిన ప్రజలే లక్ష్యంగా సాయుధ మూకలు మారణకాండకు పాల్పడ్డాయని, ఇళ్లలోకి చొరబడి ప్రజలను చిత్రహింసలకు గురిచేశారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కాగా, మధ్య నైజీరియాలో కొన్నేళ్లుగా ఈ తరహా దాడులతో వణికిపోతుంది. సామాజిక మతపరమైన, మతపరమైన విభేదాలు ఘర్షణలకు కారణమవుతున్నాయి. వాయువ్య, మధ్య నైజీరియాలో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. వేల సంఖ్యలో అమాయకుల ప్రాణాలు కోల్పోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చైనా ఉత్పత్తులను కొనడం మానేద్దాం.. మన దేశాన్ని ఆదరిద్దాం : రేణూ దేశాయ్ పిలుపు

Eleven review :నవీన్ చంద్ర నటించిన ఎలెవెన్ చిత్ర సమీక్ష

సమంత ఆ దర్శకుడుతో ప్రేమలో ఉందా? హీరోయిన్ మేనేజరు ఏమంటున్నారు?

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments