Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయుధమూకల నరమేథం... 160 మంది మృతి.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2023 (08:25 IST)
సెంట్రల్ నైజీరియాలో నరమేథం జరిగింది. సామూహిక మూకలు ఈ దారుణానికి పాల్పడ్డాయి. కొన్ని తెగల ప్రజలే లక్ష్యంగా గ్రామాలపై కాల్పులతో సాయుధ మూకలు విరుచుకుపడ్డారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం వరకు కొనసాగిన ఈ కాల్పుల్లో ఏకంగా 160 మంది మృతి చెందారు. ఈ నరమేథ హంతకులు ఇళ్లలోకి దూరి, చిత్రహింసలకు గురిచేసి ఆపై కాల్చి చంపేశారు. 
 
సెంట్రల్ నైజీరియాలోని బండిట్స్‌గా పలిచే కొన్ని సాయుధ సమూహాలు ఈ అరాచకానికి పాల్పడ్డాయి. పలు గ్రామాల ప్రజలే లక్ష్యంగా కాల్పులు జరిపాయి. కాల్పులతో నరమేథం సృష్టించాయి. వరుస కాల్పుల్లో 160 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టుగా స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కాల్పుల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, సోమవారం కూడా కాల్పులు కొనసాగడంతో ఈ మృతుల సంఖ్య ఒక్కసారిగా పెగిపోయింది. దాదాడు 300 మంది వరకు గాయపడగా, మొత్తం మృతుల సంఖ్య 160కి చేరింది. 
 
కొన్ని తెగలకు చెందిన ప్రజలే లక్ష్యంగా సాయుధ మూకలు మారణకాండకు పాల్పడ్డాయని, ఇళ్లలోకి చొరబడి ప్రజలను చిత్రహింసలకు గురిచేశారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కాగా, మధ్య నైజీరియాలో కొన్నేళ్లుగా ఈ తరహా దాడులతో వణికిపోతుంది. సామాజిక మతపరమైన, మతపరమైన విభేదాలు ఘర్షణలకు కారణమవుతున్నాయి. వాయువ్య, మధ్య నైజీరియాలో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. వేల సంఖ్యలో అమాయకుల ప్రాణాలు కోల్పోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments