Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్ ఆలయంలో తొక్కిసలాట... 10 మంది మృతి

Webdunia
శనివారం, 28 మార్చి 2015 (08:37 IST)
బంగ్లాదేశ్ లోని ఓ హిందూ దేవాలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో 10 మంది భక్తులు మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో మహిళలో అధికంగా ఉన్నారు. శుక్రవారం బంగ్లాదేశ్ లాంగ్లాబాద్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
బంగ్లాదేశ్ లోని హిందువుల పవిత్ర పుణ్యస్థలం లాంగ్లాబాద్ ప్రాంతంలోని లంగల్ బంద్ దేవాలయానికి వేలాదిమంది భక్తులు  పోటెత్తారు. అయితే అక్కడ అన్ని ఏర్పాట్లు లేకపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ తొక్కిసలాటలో 10 మంది మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు. రాజధాని ఢాకా సమీపంలో పాత బ్రహ్మపుత్ర  నదీతీరంలో వేలాదిమంది భక్తులు పుణ్యస్నానాలు చేసి ఆలయానికి వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 
 
చనిపోయిన వారంతా యాభైఏళ్లు పైబడినవారని తెలుస్తోంది. మృతుల్లో ఏడుగురు మహిళలున్నారు.  ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమంలో బంగ్లాదేశీయులతో పొరుగు దేశీయులైన భారతీయులు, నేపాలీయులు కూడా  పుణ్యస్నానాలు చేస్తారు. దుర్ఘటనపై బంగ్లాదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 
 

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

'సిరివెన్నెల'కు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments