Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాక్ రెస్టారెంట్ ఐఎస్ఐఎస్ నరమేధం... 74 మంది హతం

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మరో నరమేథానికి పాల్పడింది. ఇరాక్‌ రెస్టారెంట్‌పై విరుచుకుపడింది. ఫలితంగా 74 మంది మృత్యువాతపడ్డారు. దిఖర్ ప్రావిన్స్ పరిధిలోని

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (09:31 IST)
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మరో నరమేథానికి పాల్పడింది. ఇరాక్‌ రెస్టారెంట్‌పై విరుచుకుపడింది. ఫలితంగా 74 మంది మృత్యువాతపడ్డారు. దిఖర్ ప్రావిన్స్ పరిధిలోని నసీరియా పట్టణంలోని ఓ రెస్టారెంటుపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి, ఆపై అక్కడికి దగ్గరలోనే ఉన్న చెక్ పోస్టుపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. 
 
ఈ ఘటనలో 74 మంది మృతిచెందగా, మరో 91 మంది గాయపడ్డారు. ఘటనాస్థలిలో పరిస్థితి భీతావహంగా ఉందని, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించామని, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. 
 
కాగా, భద్రతా బలగాలతో కలసి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్న షియా సంస్థ 'హషీద్ అల్ షాబి' సభ్యుల రూపంలో వచ్చిన ముష్కరులు ఈ దారుణానికి పాల్పడినట్టు సమాచారం. అయితే, ఈ దాడికి పాల్పడింది తామేనని ఐసిస్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments