మధ్యదరా సముద్రంలో పెను విషాదం.. పడవ మునిగి 57 జలసమాధి

Webdunia
బుధవారం, 19 మే 2021 (09:22 IST)
ట్యునీషియా దేశంలో మధ్యదరా సముద్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఈ సముద్రంలో పడవ మునిగిపోవడంతో 57 మంది మృత్యువాతపడ్డారు. అలాగే, 33 మందిని ట్యునీషియాకు చెందిన రెడ్‌ క్రెసెంట్ సంస్థ రక్షించింది. 
 
లిబియా నుంచి ఇటలీకి వెళ్తున్న వలసదారుల పడవ ఒకటి ట్యునీషియా తీరంలో ప్రమాదానికిగురై సముద్రంలో మునిగిపోయింది. ఇటీవల ట్యునిషియా తీరంలో పడవలు ముగిన సంఘటనలు వరుసగా జరుగుతున్న విషయం తెల్సిందే. 
 
ప్రస్తుతం వాతావరణం కాస్త మెరుగుపడినందున ట్యునీషియా, లిబియా నుంచి యూరప్‌ వైపు వలసలు పెరిగాయి. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 90 మంది ఉన్నారని.. 33 మంది ప్రాణాలతో బయటపడగా.. వీరంతా బంగ్లాదేశీయులని రెడ్‌ క్రెసెంట్‌ అధికారి మొంగి స్లిమ్‌ పేర్కొన్నారు.
 
కాగా, ట్యునీషియా తీరంలో పడవలు ముగిన ఘటనల్లో ఇటీవల సుమారు 60 మందిపైగా వలసదారులు మరణించారు. ఈ ఏడాది 23వేలకుపైగా వలసదారులు ఐరోపాకు సముద్రం మీదుగా వలస వచ్చారని.. చాలా మంది కొత్తగా ఇటలీ, స్పెయిన్‌కు ట్యునీషియా, అల్జీరియా నుంచి వచ్చారని యూఎన్‌హెచ్‌సీఆర్‌ పేర్కొంది. ఈ ఏడాదిలో జరిగిన ప్రమాదాల్లో సుమారు 633 మంది మృతి చెందారని లేదా గల్లంతైనట్టు ఏజెన్సీ అంచనా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments