వియత్నాం తీరంలో విషాదం - పడవ బోల్తాపడి 34 మంది దుర్మరణం

ఠాగూర్
ఆదివారం, 20 జులై 2025 (09:56 IST)
వియత్నాం తీరంలో విషాదకర ఘటన జరిగింది. కొందరు ప్రయాణికులతో వెళుతున్న పడవ ప్రతికూల పరిస్థితుల కారణంగా సముద్రంలో మునిగిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో 34 మంది జలసమాధి అయ్యారు. మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు తక్షణం రంగంలోకి దిగి 11 మందిని రక్షించాయి. పర్యాటకుల్లో దాదాపు 20 మంది చిన్నారులు ఉన్నట్టు సమాచారం. 
 
వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో హా లాంగ్ బే ఒకటి. ఇక్కడకు 48 మంది పర్యాటకలు ఐదుగురు సిబ్బందితో ఓ పడవ బయలుదేరింది. అయితే, ఆ సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన గాలులు వీయడంతో పడవ అదుపుతప్పి బోల్తాపడింది. విషయం తెలిసిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి పలువురుని రక్షించాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని స్థానిక మీడియా వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments