Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో ఘోరం... లోయలో పడిన బస్సు - 28 మంది మృతి

ఠాగూర్
బుధవారం, 29 మే 2024 (15:17 IST)
పాకిస్థాన్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 28 మంది మృత్యువాతపడ్డారు. ఈ దుర్ఘటన బలూచిస్థాన్ రాష్ట్రంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మొత్తం 54 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒకటి దక్షిణ బలూచిస్థాన్‌లోని టర్బాట్ పట్టణం నుంచి ఉత్తరాలన 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని క్వెట్టాకు బయలుదేరింది. ఈ క్రమంలో బస్సు కొండ ప్రాంతంలో మలుపు వద్ద అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సహా మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మంది వరకు గాయపడ్డారు. 
 
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. డ్రైవర్ అతివేగం, నిద్రమత్తు, నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments