Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో ఘోరం... లోయలో పడిన బస్సు - 28 మంది మృతి

ఠాగూర్
బుధవారం, 29 మే 2024 (15:17 IST)
పాకిస్థాన్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 28 మంది మృత్యువాతపడ్డారు. ఈ దుర్ఘటన బలూచిస్థాన్ రాష్ట్రంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మొత్తం 54 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒకటి దక్షిణ బలూచిస్థాన్‌లోని టర్బాట్ పట్టణం నుంచి ఉత్తరాలన 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని క్వెట్టాకు బయలుదేరింది. ఈ క్రమంలో బస్సు కొండ ప్రాంతంలో మలుపు వద్ద అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సహా మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మంది వరకు గాయపడ్డారు. 
 
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. డ్రైవర్ అతివేగం, నిద్రమత్తు, నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

డాన్స్ షో డ్యాన్స్ ఐకాన్ పై సెన్సేషనల్ కామెంట్ చేసిన ఓంకార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments