Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో ఘోరం... లోయలో పడిన బస్సు - 28 మంది మృతి

ఠాగూర్
బుధవారం, 29 మే 2024 (15:17 IST)
పాకిస్థాన్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 28 మంది మృత్యువాతపడ్డారు. ఈ దుర్ఘటన బలూచిస్థాన్ రాష్ట్రంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మొత్తం 54 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒకటి దక్షిణ బలూచిస్థాన్‌లోని టర్బాట్ పట్టణం నుంచి ఉత్తరాలన 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని క్వెట్టాకు బయలుదేరింది. ఈ క్రమంలో బస్సు కొండ ప్రాంతంలో మలుపు వద్ద అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సహా మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మంది వరకు గాయపడ్డారు. 
 
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. డ్రైవర్ అతివేగం, నిద్రమత్తు, నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments