Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరు బంగారు గనిలో ప్రమాదం - 27 మంది కార్మికులు మృతి

Webdunia
సోమవారం, 8 మే 2023 (16:45 IST)
దక్షిణ అమెరికాలోని పెరులో ఘోర ప్రమాదం జరిగింది. గోల్డ్‌మైన్స్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో 27 మంది మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు నైట్ షిఫ్ట్‌లో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఇటీవలికాలంలో దేశంలో అత్యంత విషాదకరమైన మైనింగ్ ప్రమాదం ఇదేనని అధికారులు చెబుతున్నారు.
 
ఈ ప్రమాదం అరిక్విపా నగరానికి సమీపంలోని లాఎస్పరెంజా ఒకటో గనిలో జరిగినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం. ప్రమాద సమయంలో గనిలో కార్మికులు వంద మీటర్ల లోతున పనులు చేస్తున్నారని చెప్పారు. ఈ ప్రమాదంలో 27 మంది చనిపోగా 175 మందిని సురక్షితంగా రక్షించినట్టు చెప్పారు. పేలుడు ధాటికి గనిలోని చెక్క వస్తువులు కాలిపోయాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 
 
కాగా, ప్రమాదం జరిగిన ప్రాంతంలో రోదనలు మిన్నంటాయి. తమ కుటుంబ సభ్యులు మృతి చెందడంతో వారి వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇటీవలి కాలంలో ఆ దేశంలో జరిగిన అత్యంత విషాదకర మైనిగ్ ప్రమాదం ఇదే కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments