Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌లో కార్గో నౌక మునక.. 27మంది మృతి... నౌక అదృశ్యం.. ఏమైంది..?

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (20:30 IST)
Boat
ఒకవైపు కరోనాతో ప్రపంచ దేశాలు నానా తంటాలు పడుతుంటే.. మరోవైపు రోడ్డు ప్రమాదాలు, ప్రకృతీ వైపరీత్యాలు జనాల ప్రాణాలను హరిస్తున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లోని షితాలక్య నదిలో బోటు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 27మంది దుర్మరణం పాలయ్యారని అధికారులు తెలిపారు. వంద మందికి పైగా ప్రయాణికులను తీసుకెళుతున్న బోటు కార్గో నౌకను ఢీ కొన్న తర్వాత నదిలో తిరిగబడడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
ఢాకాకు 16 కిలోమీటర్ల దూరంలోని నారాయణ్‌గంజ్‌ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆదివారమే ఐదు మృతదేహాలను వెలికి తీశారు. సోమవారం మరో 22మంది మృతదేహాలను వెలికితీయడంతో మృతుల సంఖ్య 27కి పెరిగింది. 
 
భారీ క్రేన్‌ సాయంతో బోటును కూడా నదిలో నుండి వెలికి తీశారని అధికారులు తెలిపారు. ఢీ కొట్టిన తర్వాత కార్గో నౌక ఆ ప్రాంతంలో కనిపించకుండా పోయిందని పోలీసులను ఉటంకిస్తూ ఢాకా ట్రిబ్యూన్‌ పేర్కొంది. ఈ ఘటనపై దర్యాప్తుకు అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ నేతృత్వాన ఏడుగురు సభ్యులతో కమిటీ వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments