Webdunia - Bharat's app for daily news and videos

Install App

మయన్మార్‌లో సైనికుల మారణహోమం - వందమంది మృతి

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2023 (11:09 IST)
Myanmar
మయన్మార్‌లో ఆ దేశ సైన్యం మారణహోమం సృష్టిస్తుంది. గత 2021లో ప్రజా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అధికారాన్ని దక్కించుకున్న మయన్మార్ సైన్యం.. ఆ తర్వాత ఇష్టారాజ్యంగా సైనిక దాడులు చేస్తూ అనేక మంది ప్రాణాలను హరిస్తుంది. ఫలితంగా ఇప్పటివరకు మూడు వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 
 
తాజాగా జరిగిన సైనిక దాడుల్లో మరో వంది చనిపోయారు. ప్రతిపక్ష కార్యాక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ వైమానిక దాడి జరిగింది. ఫలితంగా వంద మంది వరకు చనిపోగా, వీరిలో అనేక మంది చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. 
 
ప్రజా ప్రభుత్వాన్ని కూల్చివేసి గత 2021లో సైన్యం అధికారాన్ని దక్కించుకుంది. అప్పటి నుంచి తమను వ్యతిరేకించే వారిపై ఉక్కుపాదం మోపుతోంది. ఇందులోభాగంగా, విచక్షణారహితంగా దాడులు చేయిస్తుంది. దీంతో మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
తాజాగా మాండలేకు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న పజిగ్గీ గ్రామంలో సైనిక పాలనను వ్యతిరేకించే ప్రతిపక్షం మంగళవారం ఓ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో 150 మంది వరకు పాల్గొన్నారు. వీరిని లక్ష్యంగా చేసుకుని మయన్మార్ సైనికులు దాడి చేయగా, వంద మంది వరకు చనిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments