Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్ ఆలయంలో తొక్కిసలాట.. పది మంది మృతి, 30 మందికి గాయాలు..!

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2015 (15:27 IST)
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలో ఉన్న ప్రసిద్ధి చెందిన లంగల్ బంద్ పుణ్యక్షేత్రంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పది మంది భక్తులు మృతి చెందగా, 30 మందికి పైగా గాయాలపాలయ్యారు. లంగల్ బంద్ దేవాలయానికి శుక్రవారం వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. 
 
దీంతో పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాట చోటుచేసుకుంది. చనిపోయిన వారంతో యాభైఏళ్లు పైబడినవారని సమాచారం. మృతుల్లో ఏడుగురు మహిళలున్నారని స్థానిక పోలీసు ఉన్నతాధికారి మజురూల్ ఇస్లాం తెలిపారు. ఇక్కడి పాత బ్రహ్మపుత్ర నదీతీరంలో వేలాదిమంది భక్తులు పుణ్యస్నానాలు చేసి ఆలయానికి వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 
 
ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమంలో బంగ్లాదేశీయులతో పొరుగు దేశీయులైన భారతీయులు, నేపాలీయులు కూడా పుణ్యస్నానాలు చేస్తారు. కాగా చైత్ర అష్టమి సందర్భంగా ఇక్కడ పుణ్యస్నానం చేస్తే తమ పాపాలు తొలగుతాయని భక్తుల నమ్మకం.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments