Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూఏఈకి చేరిన ఆష్రఫ్ ఘని - మానవతాదృక్పథంతోనే ఆశ్రయం కల్పించాం.

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (11:31 IST)
ఆప్ఘనిస్థాన్ దేశాన్ని తాలిబన్ తీవ్రదాలు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని దేశం విడిచిపారిపోయాడు. ప్రస్తుతం ఆయన యూఏఈలో తలదాచుకుంటున్నారు. తాలిబన్లు కాబూల్‌లోకి ప్రవేశించగానే ఆయన దేశాన్ని విడిచిపోయారు. 
 
ఘనీకి, ఆయన కుటుంబ సభ్యులకు మానవతా దృక్పథంతో ఆశ్రయం కల్పించడానికి అంగీకరించామని యూఏఈ బుధవారం తెలిపింది. అయితే, యూఏఈలో ఆయన ఎక్కడ ఉన్నదీ మాత్రం వెల్లడించలేదు.
 
మరోవైపు, ఆప్ఘనిస్థాన్‌ను తాలిబన్‌ చేతుల్లోకి వెళ్లి సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కార్ల నిండా భారీ నగదుతో దేశం నుంచి పరారయ్యారంటూ విమర్శలు ఎదుర్కొంటున్న అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ తొలిసారిగా దీనిపై వివరణ ఇచ్చారు. 
 
తాను డబ్బుతో పరారైనట్టు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. తాలిబన్లు వస్తున్నారని, వెంటనే వెళ్లిపోవాలని తన భద్రతా విభాగం కోరిందని, కనీసం బూట్లను మార్చుకునే సమయం కూడా లేదన్నారు. మరోవైపు మాతృదేశాన్ని అమ్మేసి పారిపోయిన ఘనీని అరెస్ట్‌ చేయాలని ఆ దేశ రక్షణ మంత్రి బిస్మిల్లా ఖాన్‌ ఇంటర్‌పోల్‌ను కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sugar Baby: నటి త్రిష కృష్ణన్‌పై ట్రోల్స్.. కారణం ఏంటంటే?

'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' ... మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments