Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్మేనియన్, అజర్‌బైజాన్‌ దళాల మధ్య భీకర ఘర్షణ.. 23 మంది మృతి

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2020 (15:05 IST)
Armenia-Azerbaijan
ఆర్మేనియన్, అజర్‌బైజాన్‌ దళాల మధ్య భీకరమైన ఘర్షణ చోటుచేసుకుంది. నాగోర్నో-కరాబాఖ్ ప్రత్యేక ప్రాంతం కోసం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 23 మంది మృతి చెందగా, 100 మందికిపైగా తీవ్రగాయాలపాలయ్యారు. 
 
ఈ ఘర్షణలో 16 మంది అర్మేనియన్ వేర్పాటువాదులు హతమయ్యారు. వందమందికిపైగా గాయాలపాలయ్యారు. ఇరువైపులా కూడా ప్రాణ నష్టం జరిగిందని తెలిపింది. ఒక అర్మేనియన్ మహిళ, ఒక చిన్నారి మృతి చెందినట్లు వెల్లడించింది.
 
అర్మేనియన్ వేర్పాటువాదులు ప్రయోగించిన షెల్లింగ్ దాడిలో అజర్‌బైజాన్‌‌కు చెందిన ఓ కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు చనిపోయారు. వివాదాస్పదంగా ఉన్న నాగోర్నో-కరాబాఖ్‌లో ఇంతకుముందు కూడా అజర్‌బైజాన్‌, అర్మేనియ బలగాల మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది.
 
వివాదాస్పద ప్రాంతం కోసం ఓ వైపు అజర్ బైజాన్, మరోవైపు అర్మేనియా తీవ్రమైన పోరాటం చేస్తున్నాయి. పరస్పర దాడులకు తెగబడుతున్నాయి. దీంతో ఇరువైపుల పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతోంది. అయినా, తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments