Webdunia - Bharat's app for daily news and videos

Install App

గజగజ వణికిపోయిన అమెరికా.. చర్చలకు రావాలంటూ ఉ.కొరియాకు ఆహ్వానం

అగ్రరాజ్యం అమెరికా వణికిపోయింది. ఉత్తర కొరియా ఇచ్చిన వార్నింగ్‌కు బిత్తర పోయింది. తమ వద్ద ఉన్న క్షిపణులతో అమెరికా యుద్ధ నౌకలను ధ్వంసం చేస్తామంటూ హెచ్చరించింది. దీంతో అమెరికా దిగివచ్చి.. ఉత్తర కొరియాను

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2017 (11:55 IST)
అగ్రరాజ్యం అమెరికా వణికిపోయింది. ఉత్తర కొరియా ఇచ్చిన వార్నింగ్‌కు బిత్తర పోయింది. తమ వద్ద ఉన్న క్షిపణులతో అమెరికా యుద్ధ నౌకలను ధ్వంసం చేస్తామంటూ హెచ్చరించింది. దీంతో అమెరికా దిగివచ్చి.. ఉత్తర కొరియాను ద్వైపాక్షిక చర్చలకు ఆహ్వానించింది. 
 
ఉత్తర కొరియా సముద్ర జలాల్లో జపాన్, అమెరికాలు సైనిక విన్యాసాలు చేయాలని భావించాయి. ఇందుకోసం భారీ ఎత్తున యుద్ధనౌకలను అమెరికా తరలించింది. దీనిపై ఉత్తర కొరియాపై కన్నెర్రజేసింది. క్షిపణులతో దాడులు చేస్తామని సిద్ధమైంది. 
 
దీంతో ఓ మెట్టు దిగిన అమెరికా... చర్చలకు రావాలని ఉత్తర కొరియాను కోరింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకుని, ఉద్రిక్త పరిస్థితులను మార్చేందుకు ప్రయత్నించాలని, ఇందుకోసం చర్చిద్దామని కోరుతూ పెంటగాన్‌ ప్రతినిధులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 
 
ఇంటర్నేషనల్ ఒప్పందాలను దృష్టిలో ఉంచుకుని, చర్చల ద్వారా సానుకూలత సాధించేందుకు ఉత్తర కొరియా ముందుకు రావాలని, అస్థిరతను పెంచే యత్నాలు కూడదని హితవు పలికింది. చట్ట విరుద్ధంగా క్షిపణులను పరీక్షించడం తమ దేశ భద్రతకు బెదిరింపుగా భావిస్తున్నామని, ఈ విషయంలో మరిన్ని అడుగులు ముందుకు వేయవద్దని సూచించింది.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments