Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో కరోనా రక్కసి విలయతాండవం.. ఒకే రోజు 2వేల మంది మృతి

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (11:11 IST)
ప్రాణాంతక వైరస్ కరోనా ద్వారా ఒక్క రోజే అమెరికాలో 2వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్‌తో అమెరికా విలవిలలాడుతోంది. దీంతో రోజు రోజుకీ పాజిటివ్ కేసులు కొత్తగా నమోదవుతూనే.. కరోనా మృతులు కూడా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఒక్కరోజే 2,129 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 25వేలు దాటింది. 
 
దేశంలో గత 24 గంటల్లో ఆరు లక్షలకు పైగా అమెరికన్లకు కరోనా పాజిటివ్‌ పరీక్షలు నిర్వహించారు. అమెరికాలో కరోనాకు కేంద్రబిందువుగా మారిన న్యూయార్కులో 10,842 మంది మృతి చెందారు. ఇందులో ఒక్కసారి కూడా కరోనా పరీక్షలు చేయించుకోనివారు నాలుగువేల మంది ఉన్నారు. 
 
ఈ వైరస్‌ వల్ల మరో 3778 మంది మరణించే అవకాశం ఉన్నదని ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు నగరంలో 2,03,020 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 25,981 మంది మృతి చెందారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments