Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లోని హిందువుల పరిస్థితి అత్యంత దయనీయం : అమెరికా

Webdunia
ఆదివారం, 4 అక్టోబరు 2015 (17:14 IST)
పాకిస్థాన్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులు పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని అమెరికా చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. ఇదే అంశంపై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు లొరెట్టా శాంజెస్ మాట్లాడుతూ పాకిస్థాన్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువుల పరిస్థితి దారుణంగా ఉందని, విద్య, ఉద్యోగాల్లో హిందువులకు అన్యాయం జరుగుతోందన్నారు. 
 
హిందువులపై జరుగుతున్న దాడులను, మానవ హక్కుల ఉల్లంఘనలు యధేచ్చగా జరుగుతున్నాయనీ పేర్కొన్నారు. సింధ్ ప్రావిన్స్‌లో హిందువుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందన్నారు. హిందువులను బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తున్నారని మత హింస విపరీతంగా ప్రజ్వరిల్లిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ముఖ్యంగా పాకిస్థాన్‌లోని మదర్సాల్లో కూడా మతవిద్వేషం నూరిపోస్తున్నారని శాంజెస్ ఆవేదన వ్యక్తం చేశారు. సింధి భాషను కూడా పాక్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, హఫిజ్ సయీద్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చి పాక్ ప్రభుత్వం తప్పుపని చేస్తోందని కాంగ్రెస్ సభ్యులు పలువురు అభిప్రాయపడ్డారు. 

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments