Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరింత వేగంగా రాజధాని అమరావతి నిర్మాణ పనులు... ఎలా?

ఠాగూర్
గురువారం, 23 జనవరి 2025 (09:25 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఈ నిర్మాణ పనులకు హడ్కో మరో రూ.11 వేల కోట్ల మేరకు రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ నిధులను కూడా త్వరలోనే విడుదల చేయాలని భావించింది. ఈ విషయాన్ని ఏపీ పురపాలక శాఖామంత్రి పి.నారాయణ వెల్లడించారు. అమరావతి నిర్మాణానికి రూ.11 వేలు కోట్ల నిధులు ఇవ్వాలని చేసిన విజ్ఞప్తికి హడ్కో సానుకూలంగా స్పందించిందని చెప్పారు. హడ్కో నిర్ణయంతో రాజధాని పనులు వేగవంతం అవుతాయని తెలిపారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం హడ్కో గతంలోనే రూ.11 వేల కోట్లు కేటాయించింది. దీనిపై గతేడాది అక్టోబరులోనే మంత్రి నారాయణ హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్టతో సమావేశమై నిధుల విడుదలపై చర్చించారు. హడ్కో నుంచి రుణం విడుదలకు ఏపీ ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు, నిధుల వినియోగం తీరుతెన్నులను మంత్రి నారాయణ అప్పట్లోనే హడ్కో సీఎండీకి వివరించారు. ఈ నేపథ్యంలో, తాజాగా ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల విడుదలకు ఆమోదం లభించింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments