Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరింత వేగంగా రాజధాని అమరావతి నిర్మాణ పనులు... ఎలా?

ఠాగూర్
గురువారం, 23 జనవరి 2025 (09:25 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఈ నిర్మాణ పనులకు హడ్కో మరో రూ.11 వేల కోట్ల మేరకు రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ నిధులను కూడా త్వరలోనే విడుదల చేయాలని భావించింది. ఈ విషయాన్ని ఏపీ పురపాలక శాఖామంత్రి పి.నారాయణ వెల్లడించారు. అమరావతి నిర్మాణానికి రూ.11 వేలు కోట్ల నిధులు ఇవ్వాలని చేసిన విజ్ఞప్తికి హడ్కో సానుకూలంగా స్పందించిందని చెప్పారు. హడ్కో నిర్ణయంతో రాజధాని పనులు వేగవంతం అవుతాయని తెలిపారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం హడ్కో గతంలోనే రూ.11 వేల కోట్లు కేటాయించింది. దీనిపై గతేడాది అక్టోబరులోనే మంత్రి నారాయణ హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్టతో సమావేశమై నిధుల విడుదలపై చర్చించారు. హడ్కో నుంచి రుణం విడుదలకు ఏపీ ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు, నిధుల వినియోగం తీరుతెన్నులను మంత్రి నారాయణ అప్పట్లోనే హడ్కో సీఎండీకి వివరించారు. ఈ నేపథ్యంలో, తాజాగా ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల విడుదలకు ఆమోదం లభించింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments