Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాజ్‌పేయి మన మధ్య లేరని నాలుక్కరుచుకున్న శకుంతలా భారతి

డిసెంబర్ 25న మాజీ ప్రధాని, బీజేపీ సీనియర్ నేత అటల్ బిహారీ వాజ్ పేయికి పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో సుపరిపాలనతో వాజ్ పేయ్‌కి మంచిపేరొచ్చిందన్నారు ప్రధాని మోడీ. వాజ్ పేయి 92వ పుట్టిన రోజు సందర్భంగా విషెస్

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2016 (13:47 IST)
డిసెంబర్ 25న మాజీ ప్రధాని, బీజేపీ సీనియర్ నేత అటల్ బిహారీ వాజ్ పేయికి పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో సుపరిపాలనతో వాజ్ పేయ్‌కి మంచిపేరొచ్చిందన్నారు ప్రధాని మోడీ. వాజ్ పేయి 92వ పుట్టిన రోజు సందర్భంగా విషెస్ చెప్పారు నరేంద్ర మోడీ, అమిత్ షా. ఢిల్లీలోని ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బీజేపీ కార్యకర్తగా ఉన్నప్పటి నుంచి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ట్విట్టర్‌లో వాజ్ పేయ్ తో కలిసి ఉన్న వీడియోను మోడీ షేర్ చేశారు. 
 
అయితే మరోవైపు బీజేపీ నేత శకుంతలా భారతి మాత్రం వాజ్ పేయిపై నోరు జారారు. గతంలో కూడా ఈమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ నిర్వహిస్తున్న క్యాంటీన్‌లో బీఫ్ వడ్డిస్తున్నారని, ఈ యూనివర్సిటీ అధికారులు ఓ ఆవును చంపి, ఒక ఆలయాన్ని కూల్చివేశారని కూడా ఈమె అన్నారు. తాజాగా వాజ్ పేయి మనమధ్య లేరని అలీఘర్ మేయర్ శకుంతలా భారతి షాకింగ్ కామెంట్ చేశారు. భారత మాజీ ప్రధాని వాజ్ పేయిగారు మనమధ్య లేరు..కానీ ఆయన జ్ఞాపకాలు ఉన్నాయి అని ఆమె అన్నారు. కానీ వెంటనే తేరుకున్న  శకుంతలా భారతి నాలుక్కరుచుకున్నారు.
 
తనెలా ఆమాట అన్నదో తనకే తెలియదని, పొరబాటు జరిగి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానని శకుంతలా భారతి వ్యాఖ్యానించారు. వాజ్ పేయి ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments