Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాలి ప్రాంతంలో అల్జీరియా విమాన శకలాల గుర్తింపు!

Webdunia
శుక్రవారం, 25 జులై 2014 (12:19 IST)
అల్జీరియాకు చెందిన ఒక పౌరవిమానమొకటి గురువారం బుర్కినా ఫాసో నుంచి అల్జీర్స్‌కు వస్తుండగా కుప్పకూలిపోయిన విమాన శకలాలను మాలి ప్రాంతంలో కనుగొన్నారు. ఈ విమానంలో 110 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో సహా మొత్తం 116 మంది మృత్యువాతపడ్డారు. ఈ విమానం సహారా ఎడారి ప్రాంతంలో కూలి వుండొచ్చని భావిస్తున్నారు. ఈ విమానం కూలిన ప్రాంతంలో ప్రయాణికుల శరీర భాగాలతో పాటు... విమాన శకలాలను కనుగొన్నట్టు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. 
 
ఈ విమానంలో 51 మంది ఫ్రెంచ్ జాతీయులు, 27 మంది బుర్కినా పాసో పౌరులు, 8 మంది లెబనీసె, ఆరుగురు అల్జీరియన్లు, ఐదుగురు కెనడా పౌరులు, నలుగురు జర్మన్లు, ఇద్దరు లక్సెంబర్గ్‌లు, స్విస్, బెల్జియన్, ఈజిప్టు, ఉక్రెయిన్, నైజీరియన్, కామెరూనియన్, మాలిల దేశాలకు చెందిన ఒక్కో పౌరుడు ఉన్నట్టు ఆ దేశ అధికారులు వెల్లడించారు. కాగా, కుప్పకూలిపోయిన విమానం గత పదకొండు సంవత్సరాలుగా ఈ విమానం పనిచేస్తూనే వుంది. చాలా పాతబడిపోయిన ఈ విమానం వాతవరణంలోని పీడనాన్ని తట్టుకోలేక కూలిపోయి వుండొచ్చని తెలుస్తోంది. 

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments